కశ్మీర్​లో ‘4జీ’ సేవ‌ల‌కు నో చెప్పిన సుప్రీం…కమిటీ ఏర్పాటు

జమ్ముకశ్మీర్​లో 4జీ ఇంట‌ర్నెట్ సేవలు తిరిగి ప్రారంభించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని విష‌యాల‌ను క్షుణ్ణంగా‌ పరిశీలించి, నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వ‌ర్యంలో ఓ హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.​ ఈ కమిటీలో జమ్ము కశ్మీర్​ ప్రధాన కార్యదర్శి, సమాచార మంత్రిత్వశాఖ కార్యదర్శి కూడా ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్​లో 4జీ సేవలు తిరిగి స్టార్ట్ చెయ్యాలంటూ… ఫౌండేషన్ ఫర్ మీడియా […]

కశ్మీర్​లో '4జీ' సేవ‌ల‌కు నో చెప్పిన సుప్రీం...కమిటీ ఏర్పాటు
Follow us

|

Updated on: May 11, 2020 | 3:35 PM

జమ్ముకశ్మీర్​లో 4జీ ఇంట‌ర్నెట్ సేవలు తిరిగి ప్రారంభించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని విష‌యాల‌ను క్షుణ్ణంగా‌ పరిశీలించి, నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వ‌ర్యంలో ఓ హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.​ ఈ కమిటీలో జమ్ము కశ్మీర్​ ప్రధాన కార్యదర్శి, సమాచార మంత్రిత్వశాఖ కార్యదర్శి కూడా ఉంటారని కోర్టు స్పష్టం చేసింది.

జమ్ముకశ్మీర్​లో 4జీ సేవలు తిరిగి స్టార్ట్ చెయ్యాలంటూ… ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్, షోయబ్​ ఖురేషి, జమ్ము కశ్మీర్ ప్రైవేట్ పాఠశాలల సంఘం దాఖలు చేసిన పిటిషిన్లపై అత్య‌న్న‌త‌ న్యాయస్థానం నేడు(సోమ‌వారం) విచారణ చేపట్టింది. జస్టిస్​ ఎన్​.వి.రమణ, జస్టిస్ ఆర్​.సుభాష్​రెడ్డి, జస్టిస్​ బి.ఆర్.గవాయ్​ల త్రిసభ్య ధర్మాసనం… జమ్ము కశ్మీర్​లో 4జీ ఇంట‌ర్నెట్ సేవలు పునరుద్ధరించేందుకు ప‌ర్మిష‌న్ నిరాకరించింది. జాతీయ భద్రత, మానవ హక్కుల మధ్య సమతుల్యత ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.