అనుమానాస్పద స్థితిలో రిమాండ్ ఖైదీ మృతి.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

చర్లపల్లి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీ మృతి చెందటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైలు అధికారులు

అనుమానాస్పద స్థితిలో రిమాండ్ ఖైదీ మృతి.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
Follow us

|

Updated on: Dec 30, 2020 | 11:37 AM

చర్లపల్లి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీ మృతి చెందటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైలు అధికారులు గుండెపోటుతో మృతి చెందాడని అంటున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే మృతిచెందాడని ఆరోపిస్తున్నారు. దీనిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రవి నాయక్‌ను చైన్ స్నాచింగ్ కేసుల్లో రెండున్నర నెలల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పీడీయాక్ట్ క్రింద శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్‌కు తరలించారు. కాగా రవి నాయక్ స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా అనువాడ మండలం బుద్ధారంగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు జైలు అధికారులు. దీనిపై విచారణ జరుగుతోంది.