‘మమ్మల్ని భారత్కు రప్పించండి’.. వుహాన్లోని భారత విద్యార్థుల విన్నపం!
కరోనా విజృంభిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బారిన పడి 100 మందికి పైగా చనిపోయారు. వైరస్ తీవ్రత కారణంగా చైనా ఆర్థికశాఖ 9 బిలియన్ డాలర్లు ప్రకటించింది. మహమ్మారిని తరిమివేసేందుకు నడుంబిగించింది. మరో 2,744 మందికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. క్రమేపీ […]
కరోనా విజృంభిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బారిన పడి 100 మందికి పైగా చనిపోయారు. వైరస్ తీవ్రత కారణంగా చైనా ఆర్థికశాఖ 9 బిలియన్ డాలర్లు ప్రకటించింది. మహమ్మారిని తరిమివేసేందుకు నడుంబిగించింది. మరో 2,744 మందికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. క్రమేపీ ఇండియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనాలోని వూహాన్లో మొదలైన ఈ వ్యాధి లక్షణాలు.. ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కాగా.. దీంతో భారత ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టింది.
వుహాన్ లోని హుబి యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు తమను స్వదేశానికి తీసుకురావాల్సిందిగా భారత ప్రభుత్వన్ని అభ్యర్థించారు. ‘ఇక్కడ ఎం జరుగుతుందో మాకు తెలియదు. కరోనా వైరస్ వల్ల ఇక్కడ 100మంది చనిపోయారు. మమ్మల్ని స్వదేశానికి తీసుకురావాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని’ కేరళకు చెందిన హరిత అనే యువతి తెలిపింది. అక్కడ వారికీ ఎటువంటి వైద్య పరీక్షలు చేయలేదని చెప్పింది.