ఆరు రోజుల పాటు పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు..!
గుంటూరు-దొనకొండ సెక్షన్లో నిర్మాణ పనుల కారణంగా ఈ రూట్లో తిరిగే పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆర్సీసీ బ్లాకులు, రైలు పట్టాల మార్పిడి కారణంగా ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, ఆరు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం వాసుదేవ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అవి : 1. గుంటూరు – డోన్ ప్యాసింజర్, ట్రైన్ నెంబర్ : […]
గుంటూరు-దొనకొండ సెక్షన్లో నిర్మాణ పనుల కారణంగా ఈ రూట్లో తిరిగే పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆర్సీసీ బ్లాకులు, రైలు పట్టాల మార్పిడి కారణంగా ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, ఆరు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం వాసుదేవ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అవి :
1. గుంటూరు – డోన్ ప్యాసింజర్, ట్రైన్ నెంబర్ : 57328 2. డోన్ – గుంటూరు ప్యాసింజర్, ట్రైన్ నెంబర్ : 57327 3. రేపల్లే – మార్కాపురం రోడ్డు ప్యాసింజర్ ఈ నెల 17, 21 గుంటూరు వరకే సాగనుంది. 4. మార్కాపురం రోడ్డు – తెనాలి ప్యాసింజర్ ఈ నెల 17, 21 గుంటూరు నుంచి నడుస్తుంది. 5. హుబ్లీ – విజయవాడ ప్యాసింజర్ ఈ నెల 17న 15 నిమిషాలు, 21వ తేదీన 45 నిమిషాలు మార్గమధ్యలో క్రమబద్ధీకరిస్తారు.