తిరుమలలో వైభవంగా గోదాదేవి పరిణయోత్సవం, మూలవిరాట్టుకు గోదామాలలు అలంకరించిన అపూర్వ ఘట్టం

శ్రీ‌వారికి మహా భక్తురాలైన గోదాదేవి పరిణయోత్సవం ఇవాళ తిరుమలలో వైభవంగా నిర్వహించారు. ఈ పర్వదినం పురస్కరించుకొని ..

తిరుమలలో వైభవంగా గోదాదేవి పరిణయోత్సవం, మూలవిరాట్టుకు గోదామాలలు అలంకరించిన అపూర్వ ఘట్టం
Follow us

|

Updated on: Jan 15, 2021 | 2:52 PM

శ్రీ‌వారికి మహాభక్తురాలైన గోదాదేవి పరిణయోత్సవం ఇవాళ తిరుమలలో వైభవంగా నిర్వహించారు. ఈ పర్వదినం పురస్కరించుకొని గోదామాలాలు మూలవిరాట్టుకు శుక్రవారం ఉదయం అలంకరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. అంతకుముందు గోదాదేవి మాలాలు తిరుపతి నుండి తిరుమల పెద్ద జియ్యార్‌స్వామివారి మఠానికి శుక్రవారం తెల్లవారు జామునే చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్‌ మఠం నుండి మంగళ వాయిధ్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి అలంకరించారు.