ధోనీ మనసు దోచిన నల్ల కోడి.. ఎందుకో.. ఎంటో.. తెలుసా..
కడక్నాథ్ కోళ్ల ఫామ్ను స్వస్థలం రాంచీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ధోనీ బృందం.. దాదాపు రెండు వేల కడక్నాథ్ కోడి పిల్లల కోసం ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఆటగాడిగానే కాదు… మంచి బిజినెస్మేన్గా కూడా మాజీ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మంచి పేరుంది. అంతర్జాతీయ కెరీర్కు ఆగస్టులో వీడ్కోలు పలికిన ధోనీ.. వ్యాపారాల్లో బిజీ మారబోతున్నాడు. ప్రధానంగా వ్యవసాయంపై దృష్టి పెట్టిన ధోనీ…దానికి అనుబంధంగా ఉండేవాటిపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఇందులో భాగంగా అత్యధిక పోషక విలువులున్న కడక్నాథ్ కోళ్ల ఫామ్ను స్వస్థలం రాంచీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ధోనీ బృందం.. దాదాపు రెండు వేల కడక్నాథ్ కోడి పిల్లల కోసం ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ జబువా జిల్లాకు చెందిన ఓ పౌల్ట్రీ యజమానితో ధోనీ బృందం ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. డిసెంబరు 15లోగా రెండు వేల కోడి పిల్లలను తమకు దిగుమతి చేయాలని కోరినట్లు పౌల్ట్రీ యజమాని వెల్లడించారు.
ఇప్పటికే అడ్వాన్స్ అందిందని.. దేశంలో ప్రముఖ క్రికెటర్లలో ఒకరికి తాను కడక్నాథ్ కోళ్లు అమ్ముతుండటం తనకెంతో గర్వకారణమని సదరు యజమాని పేర్కొన్నాడు. మధ్యప్రదేశ్లోని జబువా జిల్లాలో లభించే ఈ కడక్నాథ్ కోళ్లకు 2018లోనే జీఐ ట్యాగ్ కూడా లభించింది.