ఒలింపిక్ చరిత్రలో అరుదైన సంఘటన.. ఒకే గేమ్‌లో ఇద్దరికి స్వర్ణ పతకాలు.. 

TV9 Telugu

25 July 2024

పారిస్ ఒలింపిక్స్ 2024 జులై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో మొత్తం 204 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. 

పారిస్ ఒలింపిక్స్ 2024

1896లో ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ గేమ్‌లలో, ప్రతి క్రీడాకారుడు బంగారు పతకం గెలవాలని కలలు కంటాడు.

బంగారు పతకం కోసం 

అయితే ఈ గేమ్‌లలో ఇద్దరు ఆటగాళ్లకు కలిపి బంగారు పతకాలు అందించిన సందర్భం ఉంది. 

విచిత్రమైన సంఘటన

టోక్యో ఒలింపిక్స్ 2020 సందర్భంగా హైజంప్ ఈవెంట్‌లో ఇద్దరు అథ్లెట్ల మధ్య బంగారు పతకాన్ని విభజించినప్పుడు ఈ ప్రత్యేకమైన సంఘటన కనిపించింది. 

హైజంప్ ఈవెంట్‌లో

హైజంప్ ఈవెంట్‌లో ఖతార్‌కు చెందిన అథ్లెట్ ముతాజ్ ఎస్సా బర్షిమ్, ఇటలీకి చెందిన జియాన్‌మార్కో టాంబెరి మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

మ్యాచ్ డ్రా

ఈ క్రమంలో న్యాయ నిర్ణేతలు ఇద్దరినీ విజేతగా ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లకు బంగారు పతకం లభించింది. ఈ ఆటగాళ్లు స్వర్ణాన్ని పంచుకున్నారు.

స్వర్ణాన్ని పంచుకున్నారు.

ఇద్దరు అథ్లెట్ల మధ్య బంగారు పతకాన్ని పంచుకున్నందున, పురుషుల హైజంప్ ఈవెంట్‌లో రజత పతకం ఎవరికీ ఇవ్వలేదు.

రజతం ఇవ్వలేదు

దీంతో ఆ ఏడాది ఒలింపిక్స్‌లో స్వర్ణం తర్వాత నేరుగా కాంస్య పతకం లభించింది. అంటే, రజత పతకం బదులుగా గోల్డ్ మెడల్ అందించారు.

ఇద్దరికీ బంగారు పతకాలే