PM Mann Ki Baat : ప్రధాని ‘మన్ కీ బాత్’కు వ్యతిరేకంగా ఒంగోలులో వినూత్న నిరసన..గిన్నెలు, పళ్లాలు చేతపట్టి
ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్కు వ్యతిరేకంగా ఒంగోలులో వామపక్ష రైతు సంఘాల నేతలు, మహిళలు.. గిన్నెలు, పళ్లాలు చేతపట్టి...
ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్కు వ్యతిరేకంగా ఒంగోలులో వామపక్ష నేతలు, రైతు సంఘాల నాయకులు, మహిళలు.. గిన్నెలు, పళ్లాలు చేతపట్టి వాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దులతో పాటు పలు రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మన్కీబాత్ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు.
రేడియోలో ప్రధాని ప్రసంగం వస్తునంత సేపు.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో రైతులు గిన్నెలు, డబ్బాలు, మరికొన్ని వస్తువులను పట్టుకుని చప్పుడు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేసి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఒంగోలులో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. చట్టం తెచ్చే ముందు చర్చ జరిగుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావన్నారు పలువరు రైతు సంఘాల నాయకులు. కొత్త చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
Also Read :
మెడిసిన్ ఇచ్చి ఆదుకున్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం