Tirumala News: తిరుమలలో తీవ్ర ఉద్రిక్తత..పోలీసుల దురుసు ప్రవర్తన, కన్నీళ్లు పెట్టుకున్న మహిళా భక్తులు
తిరుమలో తీవ్ర గందరగోళం నెలకుంది. స్థానికంగా ఆధార్ కార్డు ఉన్నవారికే సర్వదర్శనం టోకెట్లు జారీ చేస్తుంది టీటీడీ. టోకెన్ల కోసం స్థానికేతరులు ఆందోళనకు దిగారు.
Tirumala News: తిరుమలో తీవ్ర గందరగోళం నెలకుంది. స్థానికంగా ఆధార్ కార్డు ఉన్నవారికే సర్వదర్శనం టోకెట్లు జారీ చేస్తుంది టీటీడీ. టోకెన్ల కోసం స్థానికేతరులు ఆందోళనకు దిగారు. టీటీడీ అధికారుల సమాచార లోపంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల ఆందోళనతో అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దేవస్థానం అధికారులు, పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి గేటు వద్ద ఉద్రిక్తత నెలకుంది. సహనం కోల్పోయిన పోలీసులు టోకెన్ల కోసం ఆందోళన చేస్తున్న భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వారిని నిర్దాక్షిణ్యంగా తోసేశారు. పలువురు భక్తులపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శానానికి వస్తే కొట్టి చంపేస్తారా అంటూ పోలీసులను భక్తులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుతో మహిళా భక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. గోవిందా..గోవిందా అంటూ ఆవేదనతో నినాదాలు చేశారు.
మరోవైపు సిఫార్సు లేఖల గొడవ :
తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు తీసుకొచ్చిన సిఫార్సు లేఖలను టీటీడీ తిరస్కరించడంపై సోమవారం ఉదయం తిరుమలలో వారు కూడా కొద్దిసేపు ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులు తమ ప్రాంత ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో దర్శనానికి వచ్చారు. జేఈవో కార్యాలయం వద్దకు రాగా సిబ్బంది వాటిని తీసుకోలేదు. భక్తులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న అదనపు ఈవో ధర్మారెడ్డి.. వెంటనే వాటిని తీసుకుని టికెట్లు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.
ఈ నెల 25న వైంకుఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉన్నందున సిఫార్సు లేఖలను పరిమితంగా అనుమతించినట్లు టీటీడీ తెలిపింది. ఈ కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేయనున్నారు. ఉదయం11.45 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది.
Also Read : విశాఖలో భూముల కబ్జాపై విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్…వెనక్కి ఇవ్వకుంటే క్రిమనల్ కేసులే..