ఇవాళ హైదరాబాద్కి కిషన్ రెడ్డి..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి శుక్రవారం మొదటిసారిగా నగరానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఊరేగింపు సాగే ప్రాంతాల్లో ర్యాలీలు, వేదికలు పలువురు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద భద్రతా ఏర్పట్లను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీధర్ రెడ్డి, అట్లూరి రామకృష్ణ, ఆలే జితేంద్ర. […]
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి శుక్రవారం మొదటిసారిగా నగరానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఊరేగింపు సాగే ప్రాంతాల్లో ర్యాలీలు, వేదికలు పలువురు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద భద్రతా ఏర్పట్లను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీధర్ రెడ్డి, అట్లూరి రామకృష్ణ, ఆలే జితేంద్ర.
కాగా.. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్, ప్యార డైజ్ చౌరస్తా, కవాడిగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్నగర్ వై జంక్షన్, హైదర్గూడ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్బాగ్, ఆబిడ్స్ మీదుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.