కరోనాతో త‌ప్పించుకు తిరిగేవారిపై ఉగ్రవాద నిరోధక వ్యవస్థ గురి..

జమ్ముకశ్మీర్​లో టెర్ర‌రిస్టు బృందాలను గుర్తించేందుకు చాలాకాలంగా ప‌నిచేస్తోన్న యాంటి టెర్ర‌రిస్ట్ బాడీని కరోనా మ‌హ‌మ్మారిపై పోరాడేందుకు వినియోగిస్తున్నారు అధికారులు. ఇప్పటికే.. ట్రావెల్ హిస్ట‌రీ దాచిపెట్టి తప్పించుకు తిరుగుతున్న 1000 మందిని హ్యూమన్​ ఇంటలిజెన్స్ ఉపయోగించి గుర్తించారు. వారందరినీ వెంట‌నే క్వారంటైన్​కు తరలించారు. లాక్​డౌన్​ను పూర్తిస్థాయిలో అమ‌లు అయ్యేలా చేయ‌డంలోనూ ఈ టీమ్ కీల‌కంగా ప‌నిచేస్తోంది. మార్చి 15-31 తేదీల మధ్య… సుమారు వెయ్యి మందిని క్వారంటైన్​ సెంట‌ర్ల‌కు త‌ర‌లించిన‌ట్టు..కేంద్ర ప్ర‌భుత్వానికి అధికారుల నుంచి నివేదిక అందింది. ప్రస్తుతం […]

కరోనాతో త‌ప్పించుకు తిరిగేవారిపై ఉగ్రవాద నిరోధక వ్యవస్థ గురి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 06, 2020 | 3:04 PM

జమ్ముకశ్మీర్​లో టెర్ర‌రిస్టు బృందాలను గుర్తించేందుకు చాలాకాలంగా ప‌నిచేస్తోన్న యాంటి టెర్ర‌రిస్ట్ బాడీని కరోనా మ‌హ‌మ్మారిపై పోరాడేందుకు వినియోగిస్తున్నారు అధికారులు. ఇప్పటికే.. ట్రావెల్ హిస్ట‌రీ దాచిపెట్టి తప్పించుకు తిరుగుతున్న 1000 మందిని హ్యూమన్​ ఇంటలిజెన్స్ ఉపయోగించి గుర్తించారు. వారందరినీ వెంట‌నే క్వారంటైన్​కు తరలించారు. లాక్​డౌన్​ను పూర్తిస్థాయిలో అమ‌లు అయ్యేలా చేయ‌డంలోనూ ఈ టీమ్ కీల‌కంగా ప‌నిచేస్తోంది.

మార్చి 15-31 తేదీల మధ్య… సుమారు వెయ్యి మందిని క్వారంటైన్​ సెంట‌ర్ల‌కు త‌ర‌లించిన‌ట్టు..కేంద్ర ప్ర‌భుత్వానికి అధికారుల నుంచి నివేదిక అందింది. ప్రస్తుతం వారిని ఐడెంటిఫై చేయ‌డంతో పాటు ఇత‌ర వివ‌రాల‌పై ఫోక‌స్ పెట్టారు. దాంతో పాటు 28వేల మందిపై నిరంత‌ర‌ నిఘా పెట్టారు అధికారులు. అందులో 10,600 మంది గవ‌ర్న‌మెంట్ క్వారంటైన్ సెంట‌ర్స్ కి త‌ర‌లించ‌డం లేదా హోమ్ క్వారంటైన్ లో ఉంచ‌డం చేస్తున్నారు.

కశ్మీర్​కు చెందిన ఓ వ్యాపారి మార్చి 26న కరోనాతో మరణించిన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో అల‌ర్ట్ అయ్యారు. ఆ వ్యాపారి తబ్లీగీ జమాత్​కు హాజరైన తర్వాత యూపీకి వెళ్లి మళ్లీ జ‌మ్మూకి తిరిగివ‌చ్చాడు. అత‌డు ఈ ట్రావెల్ లో ఎవ‌రెవ‌ర్ని క‌లిశార‌న్న‌దే ఇప్పుడు మిస్ట‌రీగా మారింది. రంగంలోకి దిగిన‌ నిఘా విభాగం అధికారులు వారికి ఉన్న అవకాశాల్లోని హ్యూమన్​ ఇంటలిజెన్స్​ ఉప‌యోగించి ఆ వ్యాపారి కలిసిన వారిని గుర్తిస్తున్నారు. నిఘా సంస్థ‌ల ఇన్ఫ‌ర్మేష‌న్ ఎక్స్ఛేంజ్ ద్వారా రైళ్లు, విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలు సేకరించగలిగారు.