తమ్ముడి అరెస్ట్‌పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జేసీ ట్రావెల్స్‌కి సంబంధించిన అక్రమాల కేసులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తమ్ముడి అరెస్ట్‌పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 13, 2020 | 12:29 PM

జేసీ ట్రావెల్స్‌కి సంబంధించిన అక్రమాల కేసులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్‌లపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్‌ని టీవీలో చూసి తెలుసుకున్నానని ఆయన అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్‌కి ఎవరు ఎదురు చెప్పినా ఇదే పరిస్థితి ఎదురవుతోందని జేసీ విమర్శించారు. ప్రతిపక్షమైనా, స్వపక్షమైనా ఇదే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.

తమ ఆర్థిక మూలాలన్నీ జగన్ సమూలంగా నాశనం చేశారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికి తెలుసని.. ఎవరైతే జగన్ దారిలోకి వెళ్లరో వారందరికీ ఇలాంటివే ఉంటాయని ఆయన విమర్శించారు. సీఎం జగన్ ఎవరికీ దేనికీ భయపడరని, ఆయనకు దేవుడు కూడా లేడని కామెంట్లు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం సరిగా లేదని, ఇటీవలే ఆయనకు బైపాస్ అయిందని దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా జేసీ ట్రావెల్స్‌లో అక్రమాలు జరిగాయంటూ రవాణాశాఖ అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాద్‌లో ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. వారిని అనంతపురంకు తీసుకొస్తున్నారు.

Read This Story Also: వరుడు ఐసోలేషన్‌లో.. వధువు క్వారంటైన్‌లో.. గ్రామం కంటైన్మెంట్ జోన్‌లో..!