హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా.. వెలుగులోకి కొత్త విషయాలు
హైదరాబాద్లో మరోసారి సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Hyderabad Drugs Mafia: హైదరాబాద్లో మరోసారి సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో డ్రగ్స్ మూలాలు బయటపడుతున్నాయి. అధికారుల కంట పడకుండా డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ని భూమిలో పాతి పెడుతున్నట్లు తెలిసింది. మేకా ల్యాబ్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారించగా కొత్త విషయాలు బయటికి వచ్చాయి. ఎవరి కంట పడకుండా ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న భూమిలో 45 కిలోల ఎపిడ్రిన్, 7.5కిలోల మేపిడ్రిన్ డ్రగ్ని పాతిపెట్టారు నిందితులు. ఈ క్రమంలో డీఆర్ఐ అధికారులు భూమిలో పాతిపెట్టిన 6 కోట్ల డ్రగ్స్ని వెలికి తీశారు. ఇక మరోవైపు ఇప్పటివరకు 100కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు, దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మేక ల్యాబ్తో పాటు డ్రగ్స్ తయారీ ఎక్కడెక్కడ జరుగుతుందనే దానిపై వారు దృష్టి సారించారు.
Read More:
కరోనా అప్డేట్స్: తెలంగాణలో 1,724 కొత్త కేసులు.. 10 మరణాలు