Indian Restaurant: కువైట్లో భారతీయ రెస్టారెంట్ కొంపముంచిన సోషల్ మీడియా ప్రమోషన్..!
కువైట్లో అనుమతి లేకుండా ఇండియన్ రెస్టారెంట్ నడుస్తోందని స్థానిక అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి రెస్టారెంట్ యజమానితోపాటు ఉద్యోగిని అరెస్ట్ చేశారు.
![Indian Restaurant: కువైట్లో భారతీయ రెస్టారెంట్ కొంపముంచిన సోషల్ మీడియా ప్రమోషన్..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/indian-restaurant-kuwait.jpg?w=1280)
కువైట్లో అనుమతి లేకుండా ఇండియన్ రెస్టారెంట్ నడుస్తోందని స్థానిక అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి రెస్టారెంట్ యజమానితోపాటు ఉద్యోగిని అరెస్ట్ చేశారు. కువైట్లో సీక్రెట్గా నడుస్తున్న ఇండియన్ రెస్టారెంట్ని అధికారులు కనుగొన్నారు. ఈ రెస్టారెంట్ను భారతీయ పౌరుడు నడుపుతున్నాడు. ఇందులోకి పెద్ద సంఖ్యలో కస్టమర్లు వస్తున్నారు. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్ కారణంగా, ఇది బహిర్గతమైంది.
కువైట్లోని సాల్మియాలో నివాస భవనంలో ఒక భారతీయ పౌరుడు ఈ రెస్టారెంట్ను నడుపుతున్నాడు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు. అయినప్పటికీ, రెస్టారెంట్ యజమాని టిక్టాక్లో ఒక ప్రకటన చేశాడు. దీనిని చూసిన అక్కడి పోలీసులు, స్థానిక అధికారులు ఈ అక్రమ రెస్టారెంట్ గురించి సమాచారాన్ని అందుకున్నారు. దాడి అనంతరం యాజమాన్యాన్ని, ఉద్యోగులను పోలీసులు పట్టుకుని భారత్కు పంపించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
فيديو / «تيك توكر» هندي يقوم بإعلان لمطعم هندي داخل شقة في السالمية ! pic.twitter.com/4QDFlPUx7I
— المجلس (@Almajlliss) June 20, 2024
కువైట్లో భారతీయ కస్టమర్లను ఆకర్షించడానికి రెస్టారెంట్ స్టార్ చేసిన యజమాని, ఇందు కోసం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకున్నాడు. ఈ ప్రకటననే అతని కొంపముంచింది. ఈ రెస్టారెంట్ ప్రమోషన్ కోసం ఒక భారతీయ టిక్టాక్ సెలబ్రిటీని నియమించారు. వీడియో ప్రసారం అయిన తర్వాత, ప్రకటన అనుకోకుండా కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చేరింది. ఆ తర్వాత వీడియో త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది కువైట్ బ్లాగర్లు కూడా దీన్ని షేర్ చేశారు. రెస్టారెంట్ సీక్రెట్ లొకేషన్ను బయటపెట్టడంలో యజమానుల పొరపాటుపై పలువురు నెటజన్లు మండిపడుతున్నారు.
గల్ఫ్ న్యూస్ ప్రకారం, ఈ రెస్టారెంట్ చట్టవిరుద్ధంగా నడుస్తోంది. దీని కారణంగా కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్య తీసుకుంది. ఆ తర్వాతే కువైట్ పోలీసులు రెస్టారెంట్పై దాడి చేశారు. తనిఖీల్లో అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు. రెస్టారెంట్లో ప్రభుత్వ సబ్సిడీ సరుకులు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రతా నియమాలు పాటించలేదు. అపార్ట్మెంట్లో గ్యాస్ వాసన వ్యాపించింది. ఈ కారణంగా, రెస్టారెంట్ను మూసివేయమని అధికారులు ఆదేశించారు. రెస్టారెంట్ యాజమాని సాల్మియా పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్కు తరలించారు. మిగిలిన వారిని స్థానిక చట్టాలను ఉల్లంఘించినందుకు భారత్కు తిప్పి పంపించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…