హోం ఐసోలేషన్ నిబంధనలు పాటించకుంటే చర్యలు..

దేశంలో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితుల జాబితా కూడా రెండింతలవుతోంది.

హోం ఐసోలేషన్ నిబంధనలు పాటించకుంటే చర్యలు..
Follow us

|

Updated on: Sep 23, 2020 | 3:38 PM

దేశంలో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితుల జాబితా కూడా రెండింతలవుతోంది. కొంతమంది హోం ఐసోలేషన్ లో ఉంటూనే కొవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియమాలు పాటించనివారిపట్ల కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇటువంటి కరోనా బాధితులను గుర్తించి కొవిడ్ ఆసుపత్రులకు తరలించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇళ్లు వదిలి బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కాగా, ఢిల్లీలో గడచిన 24 రోజుల్లో హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నవారి సంఖ్య 10 వేలకు పైగా పెరిగింది. ఈ నేపధ్యంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్ ఢిల్లీ ఆరోగ్యశాఖకు కొవిడ్-19 నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు, రెడ్ జోన్లపై మరింతగా దృష్టి సారించాలని సూచించారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్న కొంతమంది నియమాలను ఉల్లంఘిస్తున్నారని అటువంటివారిని గుర్తించి, ఆసుపత్రులకు, కొవిడ్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైతే రూల్స్ బ్రేక్ చేసినవారికి జరిమానాలు సైతం విధించాలని పేర్కొన్నారు.