ఇకపై ప్రభుత్వ సేవలన్నీ గ్రామ సచివాలయాల్లోనే.!

Government Services In AP Village Secretariats: ఇకపై పలు ధృవీకరణ పత్రాల కోసం మీ-సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అవన్నీ కూడా ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఉచితంగా పొందవచ్చు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 పౌర సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,002 సచివాలయాల్లో ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకునేలా సేవా పట్టిక, తదితర ఏర్పాట్లన్నింటిని పూర్తి చేసింది. […]

ఇకపై ప్రభుత్వ సేవలన్నీ గ్రామ సచివాలయాల్లోనే.!
Follow us

|

Updated on: Jan 27, 2020 | 5:54 AM

Government Services In AP Village Secretariats: ఇకపై పలు ధృవీకరణ పత్రాల కోసం మీ-సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అవన్నీ కూడా ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఉచితంగా పొందవచ్చు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 పౌర సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,002 సచివాలయాల్లో ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకునేలా సేవా పట్టిక, తదితర ఏర్పాట్లన్నింటిని పూర్తి చేసింది. అంతేకాకుండా అత్యధిక సేవలను 72 గంటల్లోనే అందించేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉంటే రుసుము చెల్లించి పొందే సేవలను మరో 5 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 11 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 540 సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుత్వం ఆలోచించగా.. ప్రస్తుతం 470 సేవలను అందించనున్నారు. మండల పరిషత్, పురపాలిక కార్యాలయాల్లో శిక్షణ పొందుతున్న ఉద్యోగులు ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేయనున్నారు.

ఇక పింఛన్ల విషయానికి వస్తే.. ప్రస్తుత లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హుల జాబితాను.. అటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. అంతేకాక అభ్యంతరాలను నెలాఖరు వరకు  స్వీకరించి తుది జాబితాను రూపొందించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Articles
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..