ఆ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్… 4 నెలల అద్దె మినహాయింపు
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్తో నష్టపోతున్న చిన్న సంస్థలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్టీపీటీ(సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్స్క్ ఆఫ్ ఇండియా) పరిధిలో ఉన్న ఐటీ సంస్థలకు 4 నెలల పాటు( 2020 మార్చి 1 నుంచి జూన్ 30 వరకు) అద్దె నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గురువారం అనౌన్స్ చేసింది. టెక్ పార్కుల్లో ఎక్కువగా చిన్న, […]
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్తో నష్టపోతున్న చిన్న సంస్థలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్టీపీటీ(సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్స్క్ ఆఫ్ ఇండియా) పరిధిలో ఉన్న ఐటీ సంస్థలకు 4 నెలల పాటు( 2020 మార్చి 1 నుంచి జూన్ 30 వరకు) అద్దె నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గురువారం అనౌన్స్ చేసింది.
టెక్ పార్కుల్లో ఎక్కువగా చిన్న, మధ్య తరహా సంస్థలే ఉన్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న అద్దె మినహాయింపు నిర్ణయంతో 60 టెక్ పార్కుల్లో ఉన్న 200 వరకు ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రయోజనం కలగనుంది. అంతేకాదు పరోక్షంగా సదరు సంస్థల్లో పనిచేసే 3 వేల మందికి లబ్ది చేకూరనుంది. ఈ అద్దె మినహాయింపు మొత్తం విలువ రూ.5కోట్ల వరకు ఉంటుందని అని ప్రభుత్వ వర్గాల సమాచారం.