Eco Friendly Food Zone: నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..
GHMC New Food Stalls: రోడ్డు పక్కన రద్దీగా ఉండే స్టాల్స్.. బారులు తీరిన జనాలు.. ఇరుకు ఇరుకుగా పార్క్ చేసిన వెహికల్స్.. ఇలాంటి సీన్లు అన్ని కూడా మాదాపూర్, హైటెక్ సిటీలలో ఉండే ఫుడ్ కోర్టుల దగ్గర దర్శనమిస్తుంటాయి. ఈ ప్లేస్లలో వాటికి గిరాకీ చాలా ఎక్కువ. ఇక ఈ స్టాళ్లలో ఎక్కువగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు కనిపిస్తుంటాయి. అవి పర్యావరణానికి బాగా హాని కలగచేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే వీటికి […]
GHMC New Food Stalls: రోడ్డు పక్కన రద్దీగా ఉండే స్టాల్స్.. బారులు తీరిన జనాలు.. ఇరుకు ఇరుకుగా పార్క్ చేసిన వెహికల్స్.. ఇలాంటి సీన్లు అన్ని కూడా మాదాపూర్, హైటెక్ సిటీలలో ఉండే ఫుడ్ కోర్టుల దగ్గర దర్శనమిస్తుంటాయి. ఈ ప్లేస్లలో వాటికి గిరాకీ చాలా ఎక్కువ. ఇక ఈ స్టాళ్లలో ఎక్కువగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు కనిపిస్తుంటాయి. అవి పర్యావరణానికి బాగా హాని కలగచేస్తాయన్న విషయం తెలిసిందే.
అయితే వీటికి భిన్నంగా శిల్పారామం సమీపంలో ఓ సరికొత్త ఫుడ్ స్టోర్ ఏర్పాటైంది. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే ఈ ఫుడ్ జోన్ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం విశేషం. రూ. 50 లక్షల వ్యయంతో 50 స్టాళ్లు ఉన్న ఈ ఫుడ్ జోన్ నగరవాసుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.
‘రెడ్ జోన్’ అని పిలవబడే ఈ ఫుడ్ జోన్లో 50 స్టాళ్లు ఉంటాయి. జీహెచ్ఎంసీ అధికారులు వాటన్నింటిని వ్యాపారులకు అప్పగించారు. సోలార్ పవర్, నో ప్లాస్టిక్, షీ టాయిలెట్స్, స్టోన్ బెంచీలు, టేబుళ్లు ప్రత్యేకతలు. నీటిలో కరిగిపోయేలా ఉండే ప్లేట్స్, గ్లాసులు, స్పూన్లు, కంటైనర్లు ఇక్కడ లభిస్తాయి. కాటన్ బ్యాగ్స్, జ్యూట్ బాగ్స్, పేపర్ బ్యాగ్లను ఉపయోగిస్తారు. హైదరాబాదీ, ఇండియన్, ఇటాలియన్, చైనీస్ వంటకాలు ఈ స్టాళ్లలో దొరుకుతాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఈ ఫుడ్ జోన్ తెరిచి ఉంటుంది. ఇక స్టాళ్లు మైంటైన్ చేస్తున్న వ్యాపారులు ఒక్కో స్టాల్కు రూ. 2 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్టాళ్లకు కరెంట్, వాటర్ సప్లై అంతటిని జీహెచ్ఎంసీ అధికారులు చూసుకుంటారు.
For More News:
మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…
సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్
నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…
విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం…
కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?
ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్తో ఆల్ టైం రికార్డు..
తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..
కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?
కోహ్లీ, రోహిత్ల కంటే.. రాహులే ది బెస్ట్..
Street vendors got a proper place to do their business. Inaugurated 50 food stalls along with MLA Gandhi garu, ZC Sherilingampally, CCP along side of ayyappa society under pass. This model is one of its first kind in our state.@arvindkumar_ias @KTRTRS @GHMCOnline pic.twitter.com/iOWaiw79N9
— BonthuRammohan,Mayor (@bonthurammohan) March 7, 2020