రాంగ్ రూట్లో బైక్ను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
వరంగల్ : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు బైక్ను ఢీ కొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న తండ్రి, కూతుళ్లతో పాటు మరో చిన్నారి మృతిచెందింది. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా కారు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
వరంగల్ : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు బైక్ను ఢీ కొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న తండ్రి, కూతుళ్లతో పాటు మరో చిన్నారి మృతిచెందింది. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా కారు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.