షైన్ ఆస్పత్రిలో చెలరేగిన మంటలు.. చిన్నారి మృతి..
హైదరాబాద్ ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా ఐసీయూలో మంటలు చెలరేగాయి. అది గమనించిన సిబ్బంది అద్దాలు పగలగొట్టి మంటలార్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు బాగా వ్యాపించడంతో ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. కాగా, పలువురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన పై కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు.. ఆస్పత్రిని […]
హైదరాబాద్ ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా ఐసీయూలో మంటలు చెలరేగాయి. అది గమనించిన సిబ్బంది అద్దాలు పగలగొట్టి మంటలార్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు బాగా వ్యాపించడంతో ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. కాగా, పలువురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటన పై కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు.. ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ పై 304ఏ కింద కేసు నమోదు చేశారు. ఏడాదిగా ఫైర్ సేఫ్టీ ఎన్వోసీని రెన్యువల్ చేయించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తోందని పోలీసులు గుర్తించారు. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు.