కరోనా వైరస్ ఎఫెక్ట్: వీడియో కాల్‌లో కూతురి అంత్యక్రియలు చూసిన తండ్రి..!

రోజూ వీడియో కాల్‌తో తనను పలకరించే తన కూతుర్ని చివరి సారి అదే వీడియో కాల్‌లో శ్మశానికి పంపాల్సి వస్తే.. ఆ నాన్న పడే నరకయాతన ఇంతా ఇంతా కాదు.

కరోనా వైరస్ ఎఫెక్ట్: వీడియో కాల్‌లో కూతురి అంత్యక్రియలు చూసిన తండ్రి..!
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2020 | 5:10 PM

రోజూ వీడియో కాల్‌తో తనను పలకరించే తన కూతుర్ని చివరి సారి అదే వీడియో కాల్‌లో శ్మశానికి పంపాల్సి వస్తే.. ఆ నాన్న పడే నరకయాతన ఇంతా ఇంతా కాదు. మాటల్లో వర్ణించలేని అలాంటి బాధను ఇప్పుడు జగిత్యాలకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి అనుభవించాడు. తన కుమార్తె చివరి చూపును సైతం చూడలేకపోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తుంగూరు గ్రామానికి చెందిన పాలాజీ భాస్కర్‌ అనే వ్యక్తి ఉపాధి కోసం ఐదు నెలల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అతడి కుమార్తె గత కొన్ని రోజులుగా డయాబెటిస్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి శుక్రవారం చనిపోయింది. కరోనా నేపథ్యంలో భారత్ లాక్ డౌన్ ప్రకటించగా..  దుబాయ్‌లోనే ఇరుక్కుపోయిన భాస్కర్.. తన కుమార్తె అంత్యక్రియలకు రాలేకపోయారు. దీంతో చేసేదేంలేక తన గారాలపట్టి అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూసి.. కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలిసి స్థానికులు సైతం కంట తడి పెట్టుకున్నారు. ఇలాంటి కష్టం ఏ తండ్రికి రావొద్దని వారు కోరుకుంటున్నారు.

Read This Story Also: ఆయన కోసం.. విక్రమార్కుడిలా పూరీ ప్రయత్నం.. ఈసారైనా సెట్ అవుతుందా..!