Mathu Vadalara 2 : రూ. 112 సినిమా టికెట్.. మత్తు వదలరా 2 దసరా ఆఫర్‌

ఐదేళ్ళ కింద మత్తు వదలరా సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు కీరవాణి కొడుకు శ్రీ సింహా. ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు చేసినా వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్ళకు మళ్లీ ఆ సినిమా సీక్వెల్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సింహా. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్ధుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్య కీలక పాత్రలో నటించాడు.

Mathu Vadalara 2 : రూ. 112 సినిమా టికెట్.. మత్తు వదలరా 2 దసరా ఆఫర్‌
Mathu Vadalara 2
Follow us

|

Updated on: Oct 04, 2024 | 10:46 AM

రీసెంట్ డేస్‌లో వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో మత్తు వదలరా 2 ఒకటి. శ్రీ సింహం హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఐదేళ్ళ కింద మత్తు వదలరా సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు కీరవాణి కొడుకు శ్రీ సింహా. ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు చేసినా వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్ళకు మళ్లీ ఆ సినిమా సీక్వెల్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సింహా. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్ధుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్య కీలక పాత్రలో నటించాడు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రేక్షకులకు క్రేజీ ఆఫర్ ఇచ్చింది మూవీ టీమ్.

ఇది కూడా చదవండి : కుమ్మేస్తున్న కుర్ర భామ.. ఈ తెలుగు అమ్మాడి అందాలు వరుస కడుతున్న ఆఫర్స్

దాసర సందర్భంగా మత్తువదలరా 2 సినిమా టికెట్ రేట్లు తగ్గించింది మూవీ టీమ్. ఈ దసరా కి మీ ఫ్యామిలీతో కేవలం రూ.112 లకే సినిమాను చూడండి అంటూ ఆఫర్‌ ను ప్రకటించారు మేకర్స్. ఈ మధ్య టికెట్ రేట్స్ పెరిగిపోవడంతో ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకు వెళ్లే అవకాశం కుదరడం లేదు. చాలా మంది థియేటర్స్ లో సినిమాలు చూడటం కంటే ఓటీటీలో చూడటమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అయితే నైజం ఏరియాలో మత్తువదరాల 2 సినిమా టికెట్స్ రేటును రూ. 112 అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇది కూడా చదవండి : Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో గంగవ్వ.. హౌస్‌లో సందడే సందడి

ఈ క్రమంలో దసరా సందర్భంగా టికెట్లకు ఆఫర్ ఇచ్చి కేవలం రూ.112 లకే ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమా కథ ఆవిషయానికొస్తే.. బాబు మోహన్ (శ్రీ సింహా), యేసుదాస్ (సత్య) ఇద్దరూ HE టీంలో స్పెషల్ ఏజెంట్స్‌గా పని చేస్తుంటారు. హై ఎమర్జెన్సీ టీంకు హెడ్ దీప (రోహిణి). అదే ఏజెన్సీలో నిధి (ఫరియా అబ్ధుల్లా) కూడా పని చేస్తుంటుంది. కిడ్నాపర్స్, మర్డరర్స్ ఇలాంటి వాళ్ళ మధ్య సాగిపోతుంటుంది యేసు, బాబు జీవితం. ఇలాంటి సమయంలో రియా అనే అమ్మాయి మిస్ అయిందని.. దామిని (ఝాన్సీ) హి టీంను అప్రోచ్ అవుతుంది. ఆమెను కాపాడతామని తమ టీంకు తెలియకుండా డీల్ మాట్లాడుకుంటారు యేసు, బాబు. కానీ రియా అనుకోని పరిస్థితుల్లో చనిపోతుంది.. అక్కడ్నుంచి ఇద్దరి జీవితాలు మలుపు తిరుగుతాయి. అదే సమయంలో ఆకాశ్ (అజయ్), క్రేజీ హీరో యువ (వెన్నెల కిషోర్) కూడా బాబు, యేసు జీవితాల్లోకి వస్తారు. అప్పట్నుంచి వాళ్ళ లైఫ్ అంతా గందరగోళంగా మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు రియాను ఎవరు చంపారు..? అనేది అసలు కథ..

ఇది కూడా చదవండి : Naa Autograph: కుర్రాళ్ళ మనసులు తాకిన భామ.. అందాల లతిక గుర్తుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దసరా స్పెషల్‌ లేజర్‌ షో
ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దసరా స్పెషల్‌ లేజర్‌ షో
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్