Rashmika Mandanna: పుట్టిన రోజు స్పెషల్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న రష్మిక… భలే ప్లాన్ వేసిందిగా..

|

Apr 01, 2024 | 7:03 PM

అల్లు అర్జున్‌తో 'పుష్ప' , సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' సినిమాల సక్సెస్ తో రష్మిక మందన్నా క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం పాన్-ఇండియన్ సినిమాలతో దూసుకుపోతోందీ అందాల తార. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటోంది రష్మిక. ఆ సినిమా విడుదలయ్యాక ధనుష్ తో ‘కుబేర’ సినిమాలో బిజీ అవుతుంది.

Rashmika Mandanna: పుట్టిన రోజు స్పెషల్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న రష్మిక... భలే ప్లాన్ వేసిందిగా..
Rashmika Mandanna Birthday
Follow us on

అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ , సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ సినిమాల సక్సెస్ తో రష్మిక మందన్నా క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం పాన్-ఇండియన్ సినిమాలతో దూసుకుపోతోందీ అందాల తార. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటోంది రష్మిక. ఆ సినిమా విడుదలయ్యాక ధనుష్ తో ‘కుబేర’ సినిమాలో బిజీ అవుతుంది. అంతకంటే ముందు టాలీవుడ్‌లో సోలో సినిమాపై దృష్టి పెట్టాలని రష్మిక మందన్న నిర్ణయించుకుంది. ఆమె నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘గర్ల్‌ఫ్రెండ్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. వివరాల్లోకి వెళితే ..రష్మిక మందన్న పుట్టినరోజు సమీపిస్తోంది. ఏప్రిల్ 5న ఈ అందాల తార బర్త్ డే. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న అభిమానులు తమ అభిమాన నటి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగూ ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించి ప్రత్యేక పోస్టర్లు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రష్మిక మందన్న పుట్టిన రోజుకి మరో ప్రధాన ఆకర్షణ ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా టీజర్. నివేదికల ప్రకారం, రష్మిక పుట్టిన రోజే ‘గర్ల్‌ఫ్రెండ్’ బృందం కొత్త టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇది యాక్షన్ ప్యాక్డ్ లవ్ స్టోరీ సినిమా అని వార్తలు వచ్చాయి. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 5న రష్మిక మందన్నను కలుసుకుని ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అభిమానులు అనుకుంటున్నారు .అయితే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.ఎందుకంటే ఆ రోజు రష్మిక మందన్న ఇండియాలో ఉండదని అంటున్నారు. విదేశాల్లోనే ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా గర్ల్ ఫ్రెండ్ టీజర్‌ను షేర్ చేసి అభిమానులతో టచ్‌లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన్నకు విదేశాల్లోనూ అభిమానులున్నారు. ఆమె కొన్ని వారాల క్రితం జపాన్‌కు వెళ్లింది. అక్కడ అభిమానులు రష్మికను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ కారణంగానే ఏటా జపాన్ కు వెళతానని ప్రకటించిందీ అందాల తార. ఇక రష్మిక నటించిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2’ సినిమా విడుదల కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.