పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి 2898 ఏడి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ తిరగరాసింది. ప్రస్తుతం డార్లింగ్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమాల కోసం ఫ్యాన్స్ వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కు పండగలాంటి న్యూస్ వచ్చేసింది. ప్రభాస్ నటించిన మూడు సూపర్ హిట్ మూవీస్ ఒకేసారి రీరిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు నెట్టింట సంబరాలు స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. డార్లింగ్ నటించిన మూడు సినిమాలు ఒకేసారి రీరిలీజ్ కావడం అతడి అభిమానులకు శుభవార్తే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మూడు సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు.
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన మూడు పాత సినిమాలు కూడా రీరిలీజ్ కానున్నాయి. ముందుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాలార్’ అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమా గతేడాది డిసెంబర్లో విడుదలైంది. సినిమా విడుదలై ఏడాది కూడా గడవకముందే మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబాలే నిర్మించారు.
అలాగే ప్రభాస్ నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం అక్టోబర్ 22న మళ్లీ విడుదల కానుంది. 2011లో విడుదలైన ఈ సినిమాలో కాజల్, తాప్సీ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ అక్టోబర్ 23న విడుదల కానుంది. 2002లో విడుదలైన ఈ మూవీ ప్రభాస్ ఫస్ట్ సినిమా. ఇందులో శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయికగా నటించింది.
ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు. హారర్ రొమాంటిక్ మూవీ ‘రాజా డీలక్స్’ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నాడు ప్రభాస్. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాలో నటించనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ 2’ ప్రారంభం కానుంది.
ఇది చదవండి :
Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.