దేవర.. కొన్ని రోజులుగా బాక్సాఫీస్ వద్ద మారుమోగుతున్న పేరు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వా జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇందులో తండ్రికొడుకుల పాత్రలో ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు తారక్. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, శ్రుతి మరాఠే, చైత్ర రాయ్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
అయితే దేవర సినిమాకు ముందుగా జాన్వీని కథానాయికగా అనుకోలేదట. ఈ సినిమాకు మొదట ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ ఆమె ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు నో చెప్పిందట. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ సూచించడంతో దేవర సినిమా ఆఫర్ జాన్వీ వద్దకు వెళ్లిందట. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. గతంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో ఈ నేషనల్ క్రష్ హీరోయిన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా గురించి అప్పట్లో ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇది చదవండి : OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, యానిమల్ 2 వంటి చిత్రాల్లో నటిస్తుంది. త్వరలోనే భారీ హైప్ నెలకొన్న పుష్ప 2 రిలీజ్ కాబోతుంది.
ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.