Samantha: అమ్మబాబోయ్..! సమంత నాగచైతన్య నుంచి అన్ని కోట్లు భరణం తీసుకుందా.?

2017లో వీరిద్దరూ గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2021లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విడాకుల తర్వాత సమంతపై అనేక ఆరోపణలు వచ్చాయి. సామ్ కారణంగానే విడాకులు జరిగాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సామ్ అభిమానులు మాత్రం దీనిని తీవ్రంగా ఖండించారు.

Samantha: అమ్మబాబోయ్..! సమంత నాగచైతన్య నుంచి అన్ని కోట్లు భరణం తీసుకుందా.?
Samantha, Naga Chaitanya
Follow us

|

Updated on: Aug 17, 2024 | 9:55 AM

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య వివాహం చేసుకున్న నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులు తీసుకున్నారని తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. 2017లో వీరిద్దరూ గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2021లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విడాకుల తర్వాత సమంతపై అనేక ఆరోపణలు వచ్చాయి. సామ్ కారణంగానే విడాకులు జరిగాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సామ్ అభిమానులు మాత్రం దీనిని తీవ్రంగా ఖండించారు. అంతే కాదు విడాకుల తర్వాత సమంత తీసుకున్న భరణం విషయంలోనూ చాలా మంది ఆమెను టార్గెట్ చేశారు. సమంత నాగ చైతన్య నుంచి 200 కోట్లు భరణం డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ వార్తల పై సమంత స్వయంగా స్పందించింది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

నిర్మాత-దర్శకుడు కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ షోలోనిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు సామ్ హాజరయ్యింది. ఈ టాక్ షోలో కరణ్ జోహార్ సమంత విడాకుల పై అలాగే ఆమె భరణం తీసుకున్న వార్తల పై ప్రశ్నలు అడిగారు. దీనికి సమంత వ్యంగ్యంగా సమాధానమిస్తూ.., ‘నేను రూ.250 కోట్ల భరణం తీసుకున్నాను. అందుకే ప్రతి ఉదయం నేను ఆదాయపు పన్ను అధికారుల కోసం ఇంటి బయట వేచి ఉంటాను. కనీసం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అయినా నిజానిజాలు చూపించగలను’ అని చెప్పుకొచ్చింది సామ్.

ఇది కూడా చదవండి : Venu Swamy: రకుల్ కూడా భర్త నుంచి విడిపోతుంది.. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పానన్న వేణు స్వామి

సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత, నాగ్ చైతన్య నటి శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఆగస్ట్ 8న నిశ్చితార్థం చేసుకున్నారు. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలను  నాగార్జున మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోయారు. తన కుమారుడి నిశ్చితార్థం తర్వాత నాగార్జున ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఎంగేజ్‌మెంట్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. నాగ చైతన్య మళ్లీ హ్యాపీగా ఉన్నాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. వాడిని చూసి సంతోషిస్తున్నాను. గతం సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు. ఆ టైంలో నా కొడుకు సంతోషంగా లేడని నాకు తెలుసు. శిభిత, చైతూ జోడీ బాగుంది.మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది అని అక్కినేని నాగార్జున అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..