Tollywood: కొత్త హీరోలు సినిమాను నాశనం చేస్తున్నారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

|

Oct 27, 2024 | 12:06 PM

సినీ రంగాన్ని కొత్త హీరోలే నాశనం చేస్తున్నారని అన్నారు డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఒక్క సినిమా హిట్టైతే చాలు లేనిపోని ఆర్బాటాలు చేస్తున్నారని.. ఊహించని విధంగా పారితోషికం పెంచుతున్నారని అన్నారు. వారికి కథ చెప్పాలంటే నేరుగా వాళ్లతోనే కాకుండా వారి మేనేజర్లతో మాట్లాడాలని అసహనం వ్యక్తం చేశారు.

Tollywood: కొత్త హీరోలు సినిమాను నాశనం చేస్తున్నారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
Bollywood
Follow us on

ప్రస్తుతం సినీరంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. భారతీయ సినిమా అంటే శతకోటి కోట్ల పరిశ్రమ. ఒక్క సినిమా మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుంది. మూవీస్ విడుదలకు ముందే భారీ హైప్ నెలకొనడం.. అతి తక్కువ సమయంలోనే రూ.200 కోట్ల మార్క్ క్రాస్ చేయడం చేస్తున్నాము. దీంతో అటు నటీనటులు రెమ్యునరేషన్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే కొందరు దర్శకనిర్మాతలు బహిరంగంగా మాట్లాడారు. నటీనటులు తమ పారితోషికం తగ్గించుకోవాలని నిర్మాతలు కోరారు. అలాగే కొందరు హీరోయిన్స్.. అనవసర ఖర్చులు కూడా నిర్మాతలపైన వేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉంటే.. కొత్త హీరోల వల్ల సినిమా ఇండస్ట్రీ నాశనమైందని ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరు రోహిత్ శెట్టి. గోల్ మాల్, సింగం, సూర్యవంశం వంటి హిట్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రోహిత్ శెట్టి.. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటాడు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శెట్టి మాట్లాడుతూ.. కొత్త హీరోల వల్ల సినీపరిశ్రమ చెడిపోతుందని.. వారే ఇండస్ట్రీని చెడగొట్టారని ఆరోపించారు.

“సీనియర్ హీరోలను చూడండి.. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ తమ సినిమాల గురించి మాట్లాడరు.. అజయ్ దేవగణ్ నటించిన దృశ్యం 2 మూవీ రూ.200 కోట్లు రాబట్టింది. కానీ వారు సక్సెస్ వేడుక చేసుకోలేదు. నా సినిమా ఇంత వసూళ్లు రాబట్టిందని నేను కూడా చెప్పుకోను..కానీ ఇప్పుడున్న యంగ్ హీరోలు తమ ఒక్క సినిమా హిట్టైతే స్టార్ హీరోల్ల ప్రవర్తిస్తున్నారు. ఆ తర్వాత వారి రెమ్యునరేషన్ పెరిగిపోతుంది. నిర్వాహకులు మంచి డిమాండ్లు చేయరు. మాలాంటి దర్శకులతో నేరుగా మాట్లాడారు. సినిమా గురించి మాట్లాడాలంటే ముందు వారి మేనేజర్లతో మాట్లాడాలి. ఇలాంటి కొత్త హీరోలే సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నారు. ఒకట్రెండు సినిమాలు హిట్ అయిన వెంటనే స్టార్స్ లా నటించడం మానేయాలి “అని రోహిత్ శెట్టి అన్నారు.

గతంలో కరణ్ జోహార్ కూడా ఇదే మాట అన్నారు. కార్తీక్ ఆర్యన్ రెండు హిట్ చిత్రాల్లో నటించారు. కానీ ఇప్పుడు దాదాపు 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. కార్తిక్ ఆర్యన్ మాత్రమే కాదు ఇటీవల ఒక్క హిట్ కూడా ఇవ్వని టైగర్ ష్రాఫ్ కూడా కొందరు నటులు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.