Renuka Swamy: ఇప్పుడు ఈ బిడ్డకు దిక్కెవరు? పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రేణుకా స్వామి భార్య

|

Oct 16, 2024 | 9:58 AM

తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపించాడనే కోపంతో రేణుకా స్వామి (29) ని అత్యంత పాశవికంగా హత్య చేశారని దర్శన్ పై ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అతనితో పాటు పవిత్ర గౌడ కూడా జైలు జీవితం గడుపుతోంది. అయితే త్వరలోనే దర్శన్ కు బెయిల్ వస్తుందని ప్రచారం జరుగుతోంది.

Renuka Swamy: ఇప్పుడు ఈ బిడ్డకు దిక్కెవరు? పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రేణుకా స్వామి భార్య
Renuka Swamy Wife
Follow us on

కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య జరిగి సుమారు నాలుగు నెలలు గడిచింది. నటుడు దర్శన్, అతని గ్యాంగ్ రేణుకా స్వామిని అత్యంత పాశవికంగా హతమార్చినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. కాగా రేణుకా స్వామి చనిపోయేనాటికి భార్య సహానా ఐదు నెలల గర్భంతో ఉంది. ఇప్పుడు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిత్రదుర్గ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సహానా డెలివరీ అయింది. దీంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అదే సమయంలో బిడ్డ పక్కన తండ్రి పక్కన లేకపోవడంతో సహానా కన్నీరుమున్నీరవుతోంది. దర్శన్ సన్నిహితురాలు పవిత్రకు రేణుకా స్వామి అసభ్యకర సందేశాలు పంపాడని అందుకే ఈ నటుడు అతనిని చంపాడని ఆరోపణలు ఉన్నాయి. రేణుకా స్వామిని బెంగళూరు తీసుకొచ్చి పట్టగెరెలోని ఓ షెడ్డులో దారుణంగా హత్య చేశారని దర్శన్ గ్యాంగ్ పై ఆరోపణలున్నాయి. రేణుకాస్వామి హత్య తో అతని కుటుంబం తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇక భార్య వేదన వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో విషాదంలో ఉన్న కుటుంబానికి ఇప్పుడు సంతోషకరమైన వార్త అందింది. రేణుకాస్వామి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది

 

కాగా రేణుకా స్వామి హత్య తర్వాత దర్శన్ అరెస్ట్ అయ్యాడు. జూన్ 11న నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను గత నాలుగు నెలలుగా జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అదే సమయంలో బెయిల్ కోసం శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటికే పలు సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కోర్టు ఈ పిటిషన్లను తిరస్కరిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించనున్నారు. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్‌ ఏ2, నటి, పవిత్రగౌడను ఏ1 గా నిర్ధారించారు పోలీసులు. కాగా దర్శన్ తరపు న్యాయవాది కోర్టులో  సాక్షులంతా కల్పితమని ఆరోపిస్తున్నారు. తప్పుడు సాక్షులను సృష్టించి దర్శన్‌ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. దర్శన్ ఆరోగ్య సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. కాగా కొన్ని రోజుల క్రితమే దర్శన్ ను బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు నుంచి బళ్లారి జైలుకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ కూడా దర్శన్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని తోటీ ఖైదీలు చెబుతున్నారు. అర్ధ రాత్రి గట్టిగా అరుస్తున్నాడని , కేకలు పెడుతున్నారని జైలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ఈ హీరోకు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయని సమాచారం.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి