దారుణం: డ్రగ్స్ నిషాలో పోలీస్‌ను కారుతో ఢీకొట్టిన యువకులు!

వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా తనిఖీలు చేస్తున్న ఎస్సైని నలుగురు తాగుబోతులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఎస్సై ప్రస్తుతం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. న్యూ ఇయర్ వేళ అనంతగిరి సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ రిసార్టులో తప్పి తాగి నిర్లక్ష్యంగా కారు నడుపుకుంటూ అటుగా వచ్చిన నలుగురు యువకులను నవాబ్‌పేట్ ఎస్సై కృష్ణ అడ్డుకున్నాడు. డ్రగ్స్, మద్యం మత్తులో తూలుతున్న ఆ […]

దారుణం: డ్రగ్స్ నిషాలో పోలీస్‌ను కారుతో ఢీకొట్టిన యువకులు!
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 02, 2020 | 6:55 PM

వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా తనిఖీలు చేస్తున్న ఎస్సైని నలుగురు తాగుబోతులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఎస్సై ప్రస్తుతం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

న్యూ ఇయర్ వేళ అనంతగిరి సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ రిసార్టులో తప్పి తాగి నిర్లక్ష్యంగా కారు నడుపుకుంటూ అటుగా వచ్చిన నలుగురు యువకులను నవాబ్‌పేట్ ఎస్సై కృష్ణ అడ్డుకున్నాడు. డ్రగ్స్, మద్యం మత్తులో తూలుతున్న ఆ నలుగురు తాగుబోతులు కారు ఆపినందుకు ఎస్సై కృష్ణపై దౌర్జన్యానికి దిగడమే కాకుండా కారుతో ఢీకొట్టి గాయపరిచారు. కాగా, ఈ ఘటనకు కారణమైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారు టోలిచౌకీకి చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్‌లని గుర్తించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ నలుగురూ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు.