విగ్రహాల తొలగింపు.. ముదురుతున్న వివాదం!

కొంతకాలం క్రితం విశాఖపట్నం బీచ్ రోడ్‌లో ఏఎన్నార్, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ విశాఖ నగరానికి సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను సరైన అనుమతులు లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారని పలువురు కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు వాటిని తొలగించాలని జీవీఎంసీ అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో 13వ తేదీ రాత్రి పోలీసులు, జీవీఎంసీ అధికారులు కలిసి హడావుడిగా మూడు విగ్రహాలను తొలగించేశారు. ఇకపోతే ఈ చర్యపై పలు అభిమాన సంఘాలు ఆరోజే […]

విగ్రహాల తొలగింపు.. ముదురుతున్న వివాదం!
Follow us

|

Updated on: May 15, 2019 | 5:46 PM

కొంతకాలం క్రితం విశాఖపట్నం బీచ్ రోడ్‌లో ఏఎన్నార్, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ విశాఖ నగరానికి సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను సరైన అనుమతులు లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారని పలువురు కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు వాటిని తొలగించాలని జీవీఎంసీ అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో 13వ తేదీ రాత్రి పోలీసులు, జీవీఎంసీ అధికారులు కలిసి హడావుడిగా మూడు విగ్రహాలను తొలగించేశారు.

ఇకపోతే ఈ చర్యపై పలు అభిమాన సంఘాలు ఆరోజే ఆందోళన చేయగా.. ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది. సినీ ప్రముఖుల విగ్రహాలను ఎలా తొలగిస్తారని.. వాటిని వెంటనే పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ సినీ దర్శకుల సంఘం పోరాటానికి దిగింది. అలా చేయని పక్షంలో తమ పోరాటాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరి ఈ వివాదంపై జీవీఎంసీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.