ఆ రికార్డ్ సాధించిన నాలుగో క్రికెటర్ ధోనీ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 13వేల పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా అవతరించాడు. అంతకు ముందు ఈ రికార్డు సచిన్, గంగూలి, ద్రవిడ్‌ల మాత్రమే సాధించారు. హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. కేదార్ జాదవ్‌తో కలిసి 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ధోనీ నమోదు చేశాడు. 72 బంతుల్లో 59 పరుగులు […]

ఆ రికార్డ్ సాధించిన నాలుగో క్రికెటర్ ధోనీ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 6:22 PM

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 13వేల పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా అవతరించాడు. అంతకు ముందు ఈ రికార్డు సచిన్, గంగూలి, ద్రవిడ్‌ల మాత్రమే సాధించారు. హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. కేదార్ జాదవ్‌తో కలిసి 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ధోనీ నమోదు చేశాడు. 72 బంతుల్లో 59 పరుగులు చేశాడు.