గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్క‌లు నాటిన‌ సింగర్‌ స్మిత‌, డైరెక్ట‌ర్ దేవ క‌ట్టా

అల్ల‌రి న‌రేష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటారు సింగ‌ర్ స్మిత‌, డైరెక్ట‌ర్ దేవ‌ర క‌ట్టా. ఈ మేర‌కు మొక్క‌లు నాటిని ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. మాదాపూర్‌లోని కాక‌తీయ హిల్స్‌లో ఈ ఇద్ద‌రు మూడు మొక్క‌లు నాటారు. అనంత‌రం దేవ క‌ట్టా మ‌రో ముగ్గురికి ఛాలెంజ్...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్క‌లు నాటిన‌ సింగర్‌ స్మిత‌, డైరెక్ట‌ర్ దేవ క‌ట్టా
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 5:43 PM

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం రోజురోజుకీ మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటడానికి పలువురు ప్రముఖులు ఉత్సాహం చూపుతున్నారు. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది.

తాజాగా అల్ల‌రి న‌రేష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటారు సింగ‌ర్ స్మిత‌, డైరెక్ట‌ర్ దేవ‌ర క‌ట్టా. ఈ మేర‌కు మొక్క‌లు నాటిని ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. మాదాపూర్‌లోని కాక‌తీయ హిల్స్‌లో ఈ ఇద్ద‌రు మూడు మొక్క‌లు నాటారు. అనంత‌రం దేవ క‌ట్టా మ‌రో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, హీరోయిన్ నివేదా, సింగ‌ర్ స్మిత త‌ల్లి జోగులంబా మొక్క‌లు నాటాల‌ని ఛాలెంజ్ విసిరారు.

ఇక సింగ‌ర్ స్మిత వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ముగ్గురు నాయ‌కుల‌కు, సినీ రంగానికి చెందిన ఓ డైరెక్ట‌ర్‌కు ఛాలెంజ్ విసిరారు. టీడీపీ నాయ‌కులు నారా లోకేష్, కాంగ్రెస్ ఎంఎల్ఏ సీత‌క్క‌, కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి కిష‌న్ రెడ్డి, సినీ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌కు మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు.

Read More:

మొద్దు శ్రీను హంత‌కుడు అనారోగ్యంతో కాదు, క‌రోనాతోనే మృతి

వాట్సాప్‌లో మ‌రో ఇంట్రెస్టింగ్ ఫీచ‌ర్‌! శాశ్వ‌తంగా నోటిఫికేష‌న్లు మ్యూట్ చేసేలా..