భావోద్వేగానికి గురై.. కంట‌త‌డి పెట్టుకున్న సోనూసూద్‌..

కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించే ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్‌.. రియ‌ల్ లైఫ్లో మాత్రం అంద‌రిచేతా హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం..

భావోద్వేగానికి గురై.. కంట‌త‌డి పెట్టుకున్న సోనూసూద్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 12:14 PM

కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించే ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్‌.. రియ‌ల్ లైఫ్లో మాత్రం అంద‌రిచేతా హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు.

అలాగే ఎవ‌రు స‌హాయం అడిగినా లేద‌నుకుండా అర్హులైన ప్ర‌తీ ఒక్క‌రికీ సాయం చేస్తూ మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడు. ప్రాంతం, కులం, భాషతో సంబంధం లేకుండా ఆప‌ద‌లో ఉన్న‌వారిని అండ‌గా నిలుస్తున్నాడు. ఇక ఆంధ్ర ప్ర‌దేశ్‌లో కూడా ఆర్థిక క‌ష్టాలు ఎదుర్కొంటున్న ఒక రైతుకు ట్రాక్ట‌ర్ పంపించి.. ఎంతో మంది ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

కాగా లాక్‌డౌన్ త‌ర్వాత ప్ర‌సారం అవుతున్న ‘ది కపిల్ శ‌ర్మ షో’కు సోనూసూద్ గెస్ట్‌గా వెళ్లాడు. అయితే ఆ షోలో.. సోనూ వ‌ల్ల స‌హాయం పొందిన వారంద‌రూ.. ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఉన్న ఓ వీడియో ప్లే చేశారు. ఇది చూసిన సోనూ సూద్ ఒక్క‌సారిగా భావోద్వేగానికి గురై.. క‌న్నీరు పెట్టుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత క‌పిల్ శ‌ర్మ య‌ధావిధిగానే షోలో న‌వ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ త‌న ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పూర్తి ఎపిసోడ్ శ‌నివారం సోనీ టీవీలో ప్ర‌సారం కానుంది.

Read More: 

క‌రోనా టెర్ర‌ర్ః ప్ర‌పంచ వ్యాప్తంగా కోటి 70 ల‌క్ష‌ల‌కు చేరుకున్న కోవిడ్ కేసులు..

తెలంగాణ జైళ్ల శాఖ‌లో క‌రోనా క‌ల‌కలం.. ఏకంగా 18 కేసులు..