Breaking : పురంధరేశ్వరికి కరోనా పాజిటివ్ !
దేశంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.
దేశంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. అనారోగ్యంగా ఉండంటంతో పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనా సోకినట్టు తేలింది. అయితే సింటమ్స్ కాస్త ఎక్కువగా ఉండడంతో ఆమె హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇటీవలే ఆమెకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ఈ క్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలా ఆమెకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇక దేశంలో కూడా కరోనా తీవ్రత కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కేసులు భారత్ లో కొత్తగా 80,472 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 62,25,764కి చేరింది. ఇందులో 9,40,441 కేసులు యాక్టివ్ గా ఉండగా 51,87,826 మంది వ్యాధి నుంచి రికవర్ అయ్యారు.
Also Read :