ఆటల పోటీలతో 54 మంది కానిస్టేబుళ్లకు కరోనా

ట్రైనింగ్‌లో భాగంగా నిర్వ హించిన ఆటల పోటీల వలన 54 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం(డీటీసీ)లో ఈ ఘటన చేసుకుంది.

ఆటల పోటీలతో 54 మంది కానిస్టేబుళ్లకు కరోనా
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 8:11 AM

Trainee Constables tests Corona positive: ట్రైనింగ్‌లో భాగంగా నిర్వ హించిన ఆటల పోటీల వలన 54 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం(డీటీసీ)లో ఈ ఘటన చేసుకుంది. ఈ నెల 24, 25వ తేదీల్లో అక్కడ వార్షిక ఆటల పోటీలు జరిగాయి. ఆ తరువాత పలువురిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో బుధవారం జరిపిన పరీక్షల్లో 10 మందికి, గురువారం జరిపిన పరీక్షల్లో 44 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ట్రైనింగ్‌ కేంద్రంలోని ఓ వ్యక్తి ద్వారానే కరోనా వ్యాపించినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారి కాంటాక్ట్‌ల వివరాలను తెలుసుకుంటున్నారు. కాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కు చేరింది. వారిలో 44, 572 వేల మంది కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 15,460 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 505 మంది మృతి చెందారు.

Read This Story Also: పెరగనున్న కలర్‌ టీవీ ధరలు!

Latest Articles