రాజస్థాన్‌లో పెరుగుతున్న కేసులు.. తాజాగా మరో 170..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం నాడు ఎనిమిది లక్షల మార్క్‌ కూడా దాటేసింది. అన్‌లాక్ 1.0 తర్వాత అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు..

రాజస్థాన్‌లో పెరుగుతున్న కేసులు.. తాజాగా మరో 170..
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 3:47 PM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం నాడు ఎనిమిది లక్షల మార్క్‌ కూడా దాటేసింది. అన్‌లాక్ 1.0 తర్వాత అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాజస్థాన్‌లో ప్రస్తుతం 23 వేల మార్క్‌ దాటేసింది. శనివారం నాడు కొత్తగా మరో 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,344కి చేరింది. ఈ విషయాన్ని రాజస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 499 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,211 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. శనివారం నమోదైన కేసుల్లో అల్వార్‌లో 40, జైపూర్‌లో33, ఉదయ్‌పూర్‌లో31 వచ్చాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు పది లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.