కిమ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. శత్రు దేశాల్లో వణుకు..

|

Apr 29, 2020 | 8:25 PM

కిమ్ జోంగ్ ఉన్.. చూడడానికి ఆయన ఐదు అడుగులే ఉంటారు. కానీ చేసే చేష్టలకు, చర్యలకు శత్రుదేశాలు గజగజ వణికిపోతాయి. గత కొద్దిరోజులుగా కిమ్ ఆరోగ్యంపై అనేక వార్తలు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం అయ్యాయి. కొన్ని కిమ్ మరణించారని చెబితే.. మరికొన్ని బ్రెయిన్ డెడ్ అని తెలిపాయి. అయితే ఇటీవల నార్త్ కొరియా ప్రభుత్వం కిమ్ ఓ రిసార్ట్‌లో సేద తీరుతున్నారని తెలిపింది. అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెప్పింది. ఆయన అక్కడ ఎందుకు ఉన్నారో అన్నది […]

కిమ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. శత్రు దేశాల్లో వణుకు..
Follow us on

కిమ్ జోంగ్ ఉన్.. చూడడానికి ఆయన ఐదు అడుగులే ఉంటారు. కానీ చేసే చేష్టలకు, చర్యలకు శత్రుదేశాలు గజగజ వణికిపోతాయి. గత కొద్దిరోజులుగా కిమ్ ఆరోగ్యంపై అనేక వార్తలు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం అయ్యాయి. కొన్ని కిమ్ మరణించారని చెబితే.. మరికొన్ని బ్రెయిన్ డెడ్ అని తెలిపాయి. అయితే ఇటీవల నార్త్ కొరియా ప్రభుత్వం కిమ్ ఓ రిసార్ట్‌లో సేద తీరుతున్నారని తెలిపింది. అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెప్పింది. ఆయన అక్కడ ఎందుకు ఉన్నారో అన్నది బహిర్గతం కాలేదు గానీ.. కరోనా కారణంగా కిమ్ అజ్ఞాతంలోకి వెళ్ళారన్న టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలో ఆయన సోదరి కిమ్ యో-జోంగ్ ఇటీవల ప్యోంగ్యాంగ్ ఉన్నతవర్గంలో పై స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

గతంలో ఆమె ఎప్పుడూ కూడా తన సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ సలహాదారుగా ఉంటూ.. ప్రోటోకాల్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు కిమ్ యో-జోంగ్ ఒక ఉన్నత పదవి అందుకున్నట్లు తెలుస్తోంది. దీనితో ఆమెను ప్యోంగ్యాంగ్‌లోని పదిమంది శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా చేసింది. అంతేకాకుండా ఆమె ఇప్పుడు పాలనలో తొమ్మిదవ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించింది. ఏది ఏమైనా కిమ్ అజ్ఞాతంలో ఉన్నా.. తన మార్క్ చర్యలతో శత్రుదేశాల్లో వణుకు పుట్టిస్తున్నారని చెప్పాలి.

Read More: 

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!

కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

హోంమంత్రి చొరవతో.. వలస కూలీల కోసం ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..

తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు..