Breaking: ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..

|

Apr 02, 2020 | 11:14 PM

Nizamuddin Markaz: దేశంలో కలకలం సృష్టించిన నిజాముద్దీన్ మర్కజ్ కేసులో విచారణను ఢిల్లీ క్రైం బ్రాంచ్ వేగవంతం చేసింది. లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వేల సంఖ్యలో సమూహాలకు ఆస్కారం కల్పించినందుకు గానూ తబ్లీఘీ-జమాత్ సంస్థ అధినేతకు, నిర్వాహకులకు ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. తబ్లీఘీ జమాత్ అధినేత మౌలానా సాద్ సహా మొత్తం ఏడుగురు నిందితుల ఇళ్లకు పోలీసులు […]

Breaking: ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..
Follow us on

Nizamuddin Markaz: దేశంలో కలకలం సృష్టించిన నిజాముద్దీన్ మర్కజ్ కేసులో విచారణను ఢిల్లీ క్రైం బ్రాంచ్ వేగవంతం చేసింది. లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వేల సంఖ్యలో సమూహాలకు ఆస్కారం కల్పించినందుకు గానూ తబ్లీఘీ-జమాత్ సంస్థ అధినేతకు, నిర్వాహకులకు ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. తబ్లీఘీ జమాత్ అధినేత మౌలానా సాద్ సహా మొత్తం ఏడుగురు నిందితుల ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు.

బుధవారం ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసు విభాగం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. 1897 నాటి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ లోని సెక్షన్ 3తో పాటు ఐపీసీలోని 269, 270, 271 మరియు 120(బీ) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, సంస్థ అధినేత మౌలానా సాద్ సహా కీలక బాధ్యతల్లో ఉన్న జీషాన్, ముఫ్తీ షెహజాద్, యూనస్, మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ అష్రఫ్‌లను నిందితులుగా పేర్కొంది. ఎవరైనా సరే ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా అంటువ్యాధి వ్యాప్తిచేసేలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తే ఐపీసీ సెక్షన్ 269 ఉపయోగిస్తారు. సెక్షన్ 270 కూడా అంటువ్యాధి వ్యాప్తిచేసే చర్యలను నిర్దేశించగా, సెక్షన్ 271 క్వారంటైన్ నిబంధనలు, ఆంక్షల ఉల్లంఘన గురించి చెబుతోంది. వీటితో పాటు 120(బీ) కుట్ర కోణాన్ని నిర్వచిస్తుంది. స్థానిక పోలీసులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకుండా సమూహాలుగా ఉన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు కేంద్రం ఈ ఘటనపై సీరియస్ అయింది. తబ్లి జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయుల వీసాలను రద్దు చేస్తూ కేంద్రం హోంశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ కార్యక్రమంలో హాజరైన 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పర్యాటక వీసాలపై వచ్చిన తబ్లి జమాత్‌ కార్యకలాపాలకు పాల్పడినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించడంతో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. విదేశీయుల చట్టం 1946, విపత్తు నిర్వహణ చట్టం 2005 నిబంధనలను ఉల్లంఘించినందుకు 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

కాగా,  లాక్‌డౌన్ కారణంగా అక్కడున్నవారు ఎటూ వెళ్లలేక ఇరుక్కుపోయారని జమాత్ నేతలు ఇప్పటివరకు చెబుతూ వస్తున్నారు. అటు కేసు నమోదైనప్పటి నుంచి జమాత్ అధినేత మౌలానా సాద్ పరారీలో ఉన్నారని ఆరోపణలు రాగా, తాను ఎటూ పారిపోలేదని, ఇంట్లోనే హోం క్వారంటైన్ అయ్యానని చెబుతూ ఓ వీడియో సందేశాన్ని సాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి తరుణంలో క్రైం బ్రాంచ్ పోలీసుల నోటీసులకు తబ్లీఘీ జమాత్ చీఫ్ ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.

For More News:

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా బాధితుల సంఖ్య.. జిల్లాల వారీగా నమోదైన కేసులు ఎన్నంటే..