లాక్డౌన్ ఎఫెక్ట్.. మనుషులు ఇన్సైడ్.. జీబ్రాలు ఔట్సైడ్..
కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాల ప్రజలందర్నీ ఇళ్లకు కట్టేసింది. జనసమూహంలో కలిస్తే ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతో.. అనేక దేశాలు లాక్డౌన్ విధించన విషయం తెలిసిందే. అయితే ప్రజలంతా ఇంటికే పరిమితమవ్వడంతో.. రోడ్లన్నీ దాదాపు నిర్మానూష్యంగా మారాయి. అయితే ఈ రోడ్లపై ఇప్పుడు పలుచోట్ల జంతువులు దర్మనమిస్తున్నాయి. అంతేకాదు.. పలుచోట్ల జంతువులు, పక్షులు స్వేచ్చగా తిరుగుతూ.. ఆటలాడుకుంటున్నాయి. తాజాగా.. నెమళ్ల నాట్యాలు..గొర్రెల గుంపు ఆటలు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ జూ పార్క్ […]
కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాల ప్రజలందర్నీ ఇళ్లకు కట్టేసింది. జనసమూహంలో కలిస్తే ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతో.. అనేక దేశాలు లాక్డౌన్ విధించన విషయం తెలిసిందే. అయితే ప్రజలంతా ఇంటికే పరిమితమవ్వడంతో.. రోడ్లన్నీ దాదాపు నిర్మానూష్యంగా మారాయి. అయితే ఈ రోడ్లపై ఇప్పుడు పలుచోట్ల జంతువులు దర్మనమిస్తున్నాయి. అంతేకాదు.. పలుచోట్ల జంతువులు, పక్షులు స్వేచ్చగా తిరుగుతూ.. ఆటలాడుకుంటున్నాయి. తాజాగా.. నెమళ్ల నాట్యాలు..గొర్రెల గుంపు ఆటలు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ జూ పార్క్ నుంచి తప్పించుకున్న జీబ్రా.. నగర వీధుల్లో హాయిగా చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో.. నెట్టింట్లో వైరల్గా మారింది.
ప్యారిస్లోని ఒర్మెస్సన్-సుర్-మారనేలోని జూ నుంచి ఓ జీబ్రా తప్పించుకుంది. జూ ద్వారాలు సరిగ్గా వేయలేదో.. లేదా తప్పించుకుని షికార్లకొచ్చిందో ఏమోకానీ.. మొత్తానికి రోడ్డెక్కింది. పార్క్ సమీపంలోని చింపిగ్ని-సుర్-మారనే నగరంలోకి ప్రవేశించింది. దీంతో ఆ జీబ్రాను చూసిన స్థానికులు షాక్ తిన్నారు. రోడ్లపై ఎంచక్కా తిరుగుతూ.. హల్ చల్ చేసింది. దీంతో స్థానికులు జీబ్రా షికార్లపై జూ అధికారులకు తెల్పడంతో.. దాన్ని పట్టుకెళ్లి మళ్లీ పార్క్కే పరిమితం చేశారు.