కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు కోవిడ్ 19, తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స .
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత అక్టోబరు మొదటివారంలో ఆయనకు కరోనా వైరస్..
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత అక్టోబరు మొదటివారంలో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. అప్పటినుంచి చికిత్స పొందుతున్నారు. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం ఆయనను గుర్ గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అహ్మద్ పటేల్ ఐసీయూలో ఉన్నారని , ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు ఫైసల్ తెలిపారు. పటేల్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.