బచావో ర్యాలీ.. బడావో ఛాన్సెస్..సూపర్ ప్లాన్ బాసూ !

ఛాన్స్ వస్తే చాలు పార్టీ అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు అన్ని పార్టీల రాజకీయ నాయకులు. కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ ట్రెండ్ మరీ ఎక్కువ. తాజాగా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారత్ బచావో కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు భలేగా ఉపయోగపడింది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందన్న డిమాండ్‌తో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుతో శనివారం ఢిల్లీలోని రామ్‌లీల మైదాన్‌లో భారీ ర్యాలీ జరిగింది. గాంధీ కుటుంబం మొత్తం హాజరై కాంగ్రెస్ […]

బచావో ర్యాలీ.. బడావో ఛాన్సెస్..సూపర్ ప్లాన్ బాసూ !
Follow us

|

Updated on: Dec 14, 2019 | 5:35 PM

ఛాన్స్ వస్తే చాలు పార్టీ అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు అన్ని పార్టీల రాజకీయ నాయకులు. కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ ట్రెండ్ మరీ ఎక్కువ. తాజాగా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారత్ బచావో కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు భలేగా ఉపయోగపడింది.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందన్న డిమాండ్‌తో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుతో శనివారం ఢిల్లీలోని రామ్‌లీల మైదాన్‌లో భారీ ర్యాలీ జరిగింది. గాంధీ కుటుంబం మొత్తం హాజరై కాంగ్రెస్ శ్రేణులనుద్దేశించి ఉత్తేజ పూరితమైన ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ.. తాను ‘‘ రాహుల్ సావర్కర్‌ని కాదని రాహుల్ గాంధీ’’ నంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రేప్ ఇన్ ఇండియా కామెంట్లను తాను వెనక్కి తీసుకోనని, కనీసం క్షమాపణ కూడా చెప్పబోనని రాహుల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. మరోవైపు సోనియా, ప్రియాంకా వధేరాలు కూడా కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రసంగాలు చేశారు.

ఇదంతా కాయిన్‌కు ఒకవైపే.. మరోవైపు ఈ ర్యాలీని తెలంగాణ నేతలు ఎలా ఉపయోగించుకున్నారనేదే ఇపుడు ఆసక్తి రేపుతోంది. టీపీసీసీ అధ్యక్షుని మార్పు త్వరలోనే జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ నేతలు భారత్ బచావో ర్యాలీకి తమ అనుచర వర్గాన్ని, అభిమానులను పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలించి, అక్కడ తమ సందడితో కాంగ్రెస్ పెద్దల నజర్‌లో పడేందుకు తెగతంటాలు పడ్డారని సమాచారం.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి తన అనుచర వర్గాన్ని భారీ ఎత్తున తరలించి, జాతీయ మీడియా దృష్టిలో పడేందుకు యత్నించారని, పలు మార్లు ఢిల్లీలో వున్న తెలుగు మీడియా వారితో మాట్లాడుతూ పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు యత్నించారని సమాచారం. రేవంత్ రెడ్డితోపాటు ఉత్తమ్ కుమార్, వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు తమ బలాన్ని ప్రదర్శించేందుకు భారత్ బచావో ర్యాలీని ఉపయోగించుకున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే, చివరి నిమిషంలో సత్తా చాటే వారికే పట్టం కట్టే నైజం వున్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నేతల యత్నాలను ఏ మేరకు పరిశీలిస్తుందో వేచి చూడాలి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు