తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి డేట్ ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 28వ తేదీన ప్రత్యూష పెళ్లి పీటలు ఎక్కనుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి డేట్ ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే..
Follow us

|

Updated on: Dec 25, 2020 | 5:34 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 28వ తేదీన ప్రత్యూష పెళ్లి పీటలు ఎక్కనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం లూర్దు మాత దేవాలయం లో ఉడుముల జైన్‌ మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూష వివాహం జరగనుంది. ఈ విషయాన్ని ప్రత్యూష, చరణ్ రెడ్డికి సంబంధించిన బంధువులు ధృవీకరించారు. కాగా, గత అక్టోబర్ నెలలో చరణ్ రెడ్డి, ప్రత్యూషల నిశ్చితార్థం విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ డి.దివ్య పర్యవేక్షించారు. కాగా, ప్రత్యూష వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో సొంత తండ్రి, పినతల్లి చిత్రహింసలతో తీవ్ర గాయాలపాలైన ప్రత్యూష ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో తానే స్వయంగా ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్‌ అధికారి రఘునందన్‌రావుకు అప్పగించారు. అప్పటి నుంచి గడిచిన ఐదేళ్లలో ప్రత్యూష ఆరోగ్యపరంగా మెరుగవడమే కాకుండా.. నర్సింగ్ కోర్సు పూర్తి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది.

Latest Articles