కరోనాపై మరోమారు జగన్ సంచలన వ్యాఖ్యలు
కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు అనుసరించిన పద్ధతి వేరని, ఇకపై అనుసరించాల్సిన పద్ధతి వేరుగా ఉంటుందన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. నాలుగో విడత లాక్డౌన్లో ...
కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో కరోనా రానివారు ఎవ్వరూ ఉండరేమోనని వ్యాఖ్యానించారు. స్పందన, అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..వచ్చే 3 రోజుల్లో ప్రజారవాణా ప్రారంభమవుతుందని తెలిపారు. కరోనా కట్టడి కోసం అందరూ స్వచ్ఛందంగా వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు అనుసరించిన పద్ధతి వేరని, ఇకపై అనుసరించాల్సిన పద్ధతి వేరుగా ఉంటుందని చెప్పారు. నాలుగో విడత లాక్డౌన్లో ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాలని, చిన్న దుకాణాల నుంచి ప్రతిషాపు ఓపెన్ చేయాలన్నారు. కరోనా కట్టడికి అధికారులు అద్భుతంగా పనిచేశారని సీఎం జగన్ కితాబిచ్చారు.
కరోనా వైరస్ను జ్వరంతో పోలుస్తూ ..గతంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యానించారు. జ్వరం మాదిరిగానే కరోనా కూడా వస్తుంది, పోతుందని.. ఇది సోకిన వారి పట్ల వివక్ష చూపవద్దని కోరారు. కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదబోదని, రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుందని జగన్ చేసిన వ్యాఖ్యలపై మొదట చాలా మంది అనేక విమర్శలు చేశారు. కానీ, ఆ తర్వాత పలువురు సీఎంలు, ప్రధాని సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనాతో కలిసి జీవించాల్సిందేనని తీర్మానించారు.