సాంప్రదాయక బంగారు పెట్టుబడులకు భిన్నంగా ఇటీవల కాలంలో బార్లు, నాణేలు లేదా ఆభరణాల రూపంలో అసలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగే బంగారం దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ గోల్డ్ను అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం 999.9 స్వచ్ఛతతో 24కే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ బంగారాన్ని ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ అంటే బంగారంలో పెట్టుబడి పెట్టే ఆధునిక పద్ధతి. ఈ పద్ధతి ద్వారా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు. అలాగే విక్రయించవచ్చు.
డిజిటల్ బంగారానికి సంబంధించిన ప్రతి యూనిట్ నిర్దిష్ట పరిమాణానికి సమానమైన నిజమైన బంగారానికి నిజమైన విలువకు మద్దతు ఇస్తుంది. డిజిటల్ బంగారం భారతదేశంలో ఎంఎంటీసీ-పీఏఎంపీ, ఆగ్మంట్, సేఫ్ గోల్డ్ వంటి సంస్థల ద్వారా అందుబాటులో ఉంది. ఆర్థిక సంస్థలు, బ్రోకరేజ్ సంస్థలు, మొబైల్ ఈ-వాలెట్ల ద్వారా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అసలు బంగారం మార్కెట్ ధర ఈ పెట్టుబడిపై రాబడిని నిర్ణయిస్తుంది. అయితే డిజిటల్ బంగారంపై పూర్తిగా బీమా ఉంటుంది. ఎంఎంటీసీ రహిత పీఏఎంపీ మీ బంగారాన్ని ఐదేళ్లపాటు నిల్వ చేస్తుంది. గూగుల్ పే ద్వారా ఎంఎంటీసీ పీఏఎంపీ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పే ఎంఎంటీసీ పీఏఎంపీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బంగారాన్ని డిజిటల్గా కొనుగోలు చేయడానికి, నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న చెల్లింపుల పద్ధతుల ద్వారా డిజిటల్ గోల్డ్ను కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..