మ‌రో గంటలో పెళ్లన‌గా, వరుడు ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా దర్శి మండలం దేవవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ నవ వరుడు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు.

మ‌రో గంటలో పెళ్లన‌గా,  వరుడు ఆత్మహత్యాయత్నం
Follow us

|

Updated on: Aug 21, 2020 | 8:47 PM

ప్రకాశం జిల్లా దర్శి మండలం దేవవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ నవ వరుడు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. మ‌రో గంట‌లోపెళ్లిపీటలు ఎక్కాల్సిన అతను… ఆసుపత్రిలో బెడ్​పైన చికిత్స పొందుతూ  చావుబ్ర‌తుకుల్లో ఉన్నాడు.

దేవవరంలో మరేశ్(23) అనే వ్య‌క్తి వాలంటీర్​గా పని చేస్తున్నాడు. మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో అత‌డికి వివాహాం కుదిర్చారు పెద్దలు. శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తానికి గంట సమయం ఉన్నప్పుడు మ‌రేశ్ బాత్​రూమ్​లోకి వెళ్లి సూసైడ్ చేసుకోడానికి ప్ర‌య‌త్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన దర్శి గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి తరలించారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. అత‌డి ఆత్మహత్యాయత్నానికి కారణాలు ఇంకా తెలియ‌రాలేదు.

bridegroom suicide attempt in prakasam distirct

Also Read :

బంగారం ధ‌ర త‌గ్గిందండోయ్, వెండి మాత్రం కొండెక్కింది

ఎస్పీ బాలు కోసం శబరిమలలో ప్ర‌త్యేక పూజ‌లు, సంగీత సమర్పణ