Vishnu Vardhan Reddy tweeted : ఏపీలో ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ విష్ణు వర్ధన్ రెడ్డి ట్వీట్..
రామతీర్థం వివాదంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్లో హిందూ దేవాలయాల ధ్వంసం కొనసాగుతోందని వ్యాఖ్యనించారు.
BJP State General Secretary Tweeted : రామతీర్థం వివాదంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్లో హిందూ దేవాలయాల ధ్వంసం కొనసాగుతోందని వ్యాఖ్యనించారు. విజయనగరం రామతీర్థం లో ఆలయాల ధ్వంసాన్ని నిరసిస్తూ బిజెపి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్పై ఆరోపణలు గుప్పించారు. ఒకరి పాలనకు మించి మరొకరి పాలనతో ఆలయాల ధ్వంసం కొనసాగుతోందిని ఆరోపించారు. ఆలయాలు కూల్చడంలో మీకు మీరే సాటి బాబు VS జగన్ అంటూ ట్వీట్ చేశారు.
5 జులై 2016 రోజు గుర్తు ఉందా చంద్రబాబు గారు..? (@ncbn) నాడు మీరు కూల్చింది. అంటూ అప్పటి పేపర్ కట్టింగ్లో జత చేశారు. బాబుగారు సీఎంగా ఉన్న సమయంలో 40 ఆలయాలు…. జగన్ గారు సీఎంగా ఇప్పుడు 20 ఆలయాలు అంటూ పేర్కొన్నారు. నేడు రామతీర్థ రామాలయానికి వెళ్ళేఅర్హత మీకు ఉందా బాబు గారు.. అంటూ పేర్కొన్నారు. రాజకీయాల కోసం రామాలయానికి వెళ్ళి ఆ ఆలయాన్ని అపవిత్రంచేయద్దు అంటు రాసుకొచ్చారు.
ఆలయాలు కూల్చడంలో మీకు మీరే సాటి బాబు VS జగన్
5 జులై 2016 రోజు గుర్తు ఉందా @ncbn గారు? నాడు మీరు కూల్చింది. బాబుగారు సియం గా40 ఆలయాలు. జగన్ గారు సియం గా20 ఆలయాలు. నేడు రామతీర్థ రామాలయానికి వెళ్ళేఅర్హత మీకు ఉందా బాబు గారు?రాజకీయాలకోసం రామాలయానికి వెళ్ళి ఆ ఆలయాన్ని అపవిత్రంచేయద్దు pic.twitter.com/wkk9OOfhhC
— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) January 2, 2021