బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: తిట్ల రాజకీయం
టీడీపీ, వైసీపీ పరస్పర దూషణకు ఏపీ అసెంబ్లీ వేదిక అవుతోంది. గత అసెంబ్లీలో టీడీపీ సభ్యులు జగన్ను టార్గెట్ చేస్తే, ఈ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. తమను తిట్టించడానికే అసెంబ్లీ సమావేశాలంటూ విపక్షం ఆరోపిస్తుంటే, తమకు చెప్పాల్సిన చంద్రబాబు రెచ్చగొట్టి తమతో తిట్టించుకున్నారంటూ అధికారపక్షం కౌంటర్ ఇస్తోంది. ఈ తిట్ల పర్వంలో ఎవరిది పైచేయి అన్న అంశంపైనే ఇవాళ్టి బిగ్ డిబేట్. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆరోపణలు, విమర్శలుదాటి తిట్లదండకం ఊపందుకుంది. చంద్రబాబు […]
టీడీపీ, వైసీపీ పరస్పర దూషణకు ఏపీ అసెంబ్లీ వేదిక అవుతోంది. గత అసెంబ్లీలో టీడీపీ సభ్యులు జగన్ను టార్గెట్ చేస్తే, ఈ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. తమను తిట్టించడానికే అసెంబ్లీ సమావేశాలంటూ విపక్షం ఆరోపిస్తుంటే, తమకు చెప్పాల్సిన చంద్రబాబు రెచ్చగొట్టి తమతో తిట్టించుకున్నారంటూ అధికారపక్షం కౌంటర్ ఇస్తోంది. ఈ తిట్ల పర్వంలో ఎవరిది పైచేయి అన్న అంశంపైనే ఇవాళ్టి బిగ్ డిబేట్.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆరోపణలు, విమర్శలుదాటి తిట్లదండకం ఊపందుకుంది. చంద్రబాబు చదువుమీద, మానసిక స్థితి మీద, హెరిటేజ్ మీద వైసీపీ సభ్యులు వరుసదాడులు చేస్తున్నారు. 2430 జీవో మీద ప్లకార్డులు పట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుంపుగా రావడంపై దుమారం రేగింది. టీడీపీ బృందాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో, జగన్ను ఉన్మాది అంటూ చంద్రబాబు తిట్టారనే వీడియోను గురువారం ప్రభుత్వం ప్రదర్శించింది. ఇదే అంశానికి సంబంధించి లోకేష్ ఒక మార్షల్ గొంతుపట్టుకున్న వీడియోను శుక్రవారం సభలో ప్రదర్శించారు. చంద్రబాబు సారీ చెప్పాలని అధికార పక్షం మూకుమ్మడిగా డిమాండ్ చేసినా ఫలితం లేదు. దిశ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు అచ్చెన్నాయుడు, కొడాలి నాని మధ్య వ్యక్తిగత మాటల యుద్ధం జరిగింది. ఇంగ్లీష్ మీడియంపై సాగిన చర్చలో చంద్రబాబు చేసిన ఆరోపణలకు బుద్ధి ఉందా అంటూ జగన్ చేసిన విమర్శలు దుమారం రేపాయి.