TDP Leader Murder: ఆ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. అమ్మవారిపై ప్రమాణం చేసిన ఎమ్మెల్యే..
TDP Leader Murder: ఆంధ్రప్రదేశ్లో దైవ ప్రమాణాల రాజకీయం కొనసాగుతోంది. ఇటీవల కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ..
TDP Leader Murder: ఆంధ్రప్రదేశ్లో దైవ ప్రమాణాల రాజకీయం కొనసాగుతోంది. ఇటీవల కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు కారణం ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డే అని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించింది. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేగాయి. టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబు, నారా లోకేష్, సహా ఇతర నేతలు, వైసీపీపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి.. సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఆరోపణలు ఆగకపోవడంతో దైవ ప్రమాణానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాల వద్ద ఉన్న చౌడేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు. తనకు సుబ్బయ్యను హత్య చేయించాల్సిన అవసరం లేదని ప్రమాణం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే తనను ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. తాను శివపార్వతులను కొలుస్తానని, నామినేషన్ కూడా ఇక్కడి నుంచే వెళ్లి వేశానని శివప్రసాద్ చెప్పుకొచ్చారు. సుబ్బయ్య హత్యతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హత్యపై సమాచారం ఉంటే సుబ్బయ్యను తప్పకుండా కాపాడేవాడినని చెప్పుకొచ్చారు. కాగా, సుబ్బయ్యను తామే హత్య చేశామంటూ ముగ్గరు వ్యక్తులు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.
Also read:
విశాఖకు చెందిన దంపతులకు అరుదైన గుర్తింపు.. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గోనేందుకు అవకాశం