AP News: పార్టీల పరంగా రాజకీయ ప్రత్యర్థులు.. అనుకోకుండా ఎదురుపడ్డారు..
వాళ్ళిద్దరూ గత ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి ఒకరు ఎంపిగా, మరొకరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఎంపి మాత్రం ఈసారి పక్కపార్టీలోకి జంప్ చేశారు. ఎమ్మెల్యే మాత్రం అదే పార్టీలో పార్లమెంట్ పరిధిలోని మరో నియోజకవర్గంలో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా ఇద్దరూ ఒకే ఊర్లో అన్నదాన కార్యక్రమంలో తారసపడ్డారు.
వాళ్ళిద్దరూ గత ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి ఒకరు ఎంపిగా, మరొకరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఎంపి మాత్రం ఈసారి పక్కపార్టీలోకి జంప్ చేశారు. ఎమ్మెల్యే మాత్రం అదే పార్టీలో పార్లమెంట్ పరిధిలోని మరో నియోజకవర్గంలో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా ఇద్దరూ ఒకే ఊర్లో అన్నదాన కార్యక్రమంలో తారసపడ్డారు. అంతే గత ఎన్నికల బంధం గుర్తుకొచ్చింది. ఈసారి చెరోపార్టీలో ఉన్నా విబేధాలు లేకుండా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకున్నారు. మీపార్టీ నుంచి మీరు గెలుస్తారంటే, మీరు కూడా గెలుస్తారంటూ ఒకరినొకరు అడ్వాన్స్ గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. ఒకరు భోజనం చేస్తుంటే మరొకరు ఆయనకు ఎదురుగా కూర్చుని సాధకబాధలు చెప్పుకున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు.
ప్రకాశంజిల్లా కొండపి నియోజకర్గంలోని జాళ్ళపాలెంలో తరునాళ్ళ జరుగుతోంది. ఈ తిరునాళ్ళకు కొండపి నుంచి వైసిపి అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. తిరునాళ్ళ సందర్భంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్థానికులతో కలిసి భోజనం చేశారు. అదే సమయంలో తిరునాళ్ళలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భక్తులకు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డి భోజనం వడ్డిస్తున్నారు. అదే పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్న వైసిపి అసెంబ్లీ అభ్యర్ధి ఆదిమూలపు సురేష్ను టిడిపి పార్లమెంట్ అభ్యర్ధి మాగుంట చూశారు. వెంటనే మంత్రి సురేష్ దగ్గరకు వచ్చి ” హాయ్ సురేష్ ” బాగున్నావా.. అంటూ అప్యాయంగా పలకరించారు. ప్రత్యర్ధి పార్టీ ఎంపి అభ్యర్ధి మాగుంట తనంతట తాను వచ్చి పలకరించడంతో మంత్రి సురేష్ కూడా గౌరవమర్యాదలతో భోజనం చేస్తూనే లేచి మాగుంటకు అభివాదం చేశారు. అనంతరం మంత్రి సురేష్కు ఎదురుగా కుర్చీవేసుకుని కూర్చున్నారు మాగుంట. ఇద్దరూ కుశలప్రశ్నలు వేసుకున్న తరువాత ఇద్దరికి మంచే జరుగుతుందని వ్యాఖ్యానించుకున్నారు. ఈ సీన్ చూసి ఇటు వైసిపి, అటు టిడిపి నేతలు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఈ ఇద్దరు నేతలను చూసిన జనం మాత్రం రాజకీయ నేతలంతా ఒక్కటే సుమీ అనుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..