వైసీపీ ఎంపీ భరత్ గన్మెన్, ఫొటోగ్రాఫర్కి కరోనా
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటి వరకు సామాన్యుల్లో కరోనా టెన్షన్ ఉండగా.. ఇప్పుడు ప్రజాప్రతినిధుల్లోనూ ఈ వైరస్ ఆందోళన అధికమవుతోంది.
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటి వరకు సామాన్యుల్లో కరోనా టెన్షన్ ఉండగా.. ఇప్పుడు ప్రజాప్రతినిధుల్లోనూ ఈ వైరస్ ఆందోళన అధికమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. మరోవైపు ప్రజాప్రతినిధుల దగ్గర పనిచేస్తోన్న వారు సైతం వైరస్ బారిన పడుతున్నారు. ఆ మధ్యన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి గన్మెన్ కరోనాతో మృతిచెందారు. మొన్నటికి మొన్న ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దగ్గర పనిచేసే ఇద్దరు కానిస్టేబుల్లు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ గన్మెన్, ఫొటోగ్రాఫర్కి కరోనా సోకింది. దీంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల్లో నెగిటివ్గా తేలింది. కాగా పార్లమెంట్ సమావేశాలకు వెళ్లి వచ్చినప్పటి నుంచి భరత్ హోం క్వారంటైన్లో ఉన్నారు. తానే సొంతగా కారు డ్రైవ్ చేసుకుంటూ, గన్మెన్ లేకుండా కరోనా నివారణ చర్యలు పాటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.